ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం నియోజకవర్గం ఈ నెల 19వ తేదీన హుజురాబాద్ ఎమ్మెల్యే, బిజెపి స్టార్ క్యాంపైనర్ ఈటెల. రాజేందర్ గోదావరిఖనికి రానున్నారని బిజెపి పార్టీ అభ్యర్థి కందుల సంధ్యారాణి తెలిపారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా మంచిర్యాలకు చేరుకుంటారని అక్కడ సభ ముగిసిన అనంతరం రోడ్డు మార్గాన గోదావరిఖనికి రానున్నారని మొదటగా గోదావరి నది బ్రిడ్జి వద్ద ఘన స్వాగతం పలికి ర్యాలీగా మధ్యాహ్నం 2 గంటలకు గోదావరిఖని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జరిగే సభకు హాజరవుతారని సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని సంధ్యారాణి ఒక ప్రకటనలో కోరారు.
ఈటెల సభను విజయవంతం చేయండి – సంధ్యారాణి
109
previous post