సూర్యాపేట జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. కోదాడ మున్సిపాలిటీ సమీపంలో అర్ధరాత్రి అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న దుకాణాల పైకి కారు దూసుకుపోయింది. దీంతో ఒకరికి త్రీవ గాయాలయ్యాయి. అయితే ప్రమాద సమయంలో దుకాణాదారులు ఎవరూ లేక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పట్టణ సీఐ రాము వెల్లడించారు.