408
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 60 వ వార్షిక మహోత్సవాలు…. జనవరి 13 న ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దేవాలయం బంగారం వెండి మెరుగుల కొరకు మరియు అమ్మవారి విగ్రహానికి రంగుల వేయుట కొరకు, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మూలవిరాట్ దర్శనం ఈరోజు నుండి ఆపివేసి తిరిగి ఈనెల 28న ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం మూలవిరాట్ దర్శనాన్ని పునఃప్రారంభిస్తామన్నారు. ఈనెల 27 వరకు అమ్మవారి గర్భాలయం వెనుక ప్రదక్షిణ మండపంలో ఉత్సవ విగ్రహమునకు పూజలు యధావిధిగా జరుగుతాయని ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజి,ధర్మకర్తల మండలి చైర్మన్, ధర్మకర్తలు తెలియచేసినారు..





Total views : 149653