Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh నరసరావుపేటలో పోటాపోటీగా ఆత్మీయ సమావేశాలు

నరసరావుపేటలో పోటాపోటీగా ఆత్మీయ సమావేశాలు

by Satya
TDP and YCP

పల్నాడు జిల్లా (Palnadu) నరసరావుపేటలో పోటాపోటీగా ఆత్మీయ సమావేశాలు జరిగాయి. రానున్న ఎన్నికలకు సిద్ధమవుతున్నారు వైసీపీ, టీడీపీ ఎంపీ అభ్యర్థులు. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో టీడీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఆయనను ప్రకటించనుంది టీడీపీ అధిష్టానం. ఇప్పటికే నారా చంద్రబాబుతో రెండుసార్లు భేటీ అయ్యారు ఎంపీ లావు కృష్ణదేవరాయలు. టీడీపీ పార్టీలోకి చేరకముందే డాక్టర్లు, వ్యాపారస్తులు, న్యాయవాదులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు ఎంపీ లావు. అయితే నెల్లూరువాసులు నరసరావుపేటలో పోటీ చేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ అందరిలోనూ ఉంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా నెల్లూరుకి చెందిన.. మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేయనున్నారు. నరసరావుపేటలో భారీ ఎత్తున అనిల్ కుమార్ యాదవ్ కు ఆహ్వాన సభ నిర్వహించారు ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, వైసీపీ ఇన్చార్జిలు. గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి నరసరావుపేట ఎంపీలుగా గెలుపొందారు. వైసీపీ ఎంపీగా గెలిచిన లావు కృష్ణదేవరాలకి నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మంచి పట్టు ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా లావు కృష్ణదేవరాయలు గెలిచారు. 2024 ఎన్నికలకు టీడీపీ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.
    ప్రముఖ వ్యాపార దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఆయనకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్‌ఎక్స్’అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత, ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన మొదటి ‘ట్రిలియనీర్‌గా…
  • వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.
    మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉక్కుపాదం మోపింది. వెనెజువెలాకు చెందిన కరుడుగట్టిన డ్రగ్స్‌ గ్యాంగ్‌ ట్రెన్‌ డి ఆరాగ్వాపై చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఆ ముఠా కీలక నేత హెక్టర్‌ రస్తెన్‌ఫోర్డ్‌ గురెరో ఫ్లోర్స్‌ హతమైనట్లు అమెరికా…
  • కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.
    కాకినాడ జిల్లాలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో తమ కుమార్తెను యువకుడు ఉరివేసి హత్య చేశాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందంటూ ఆందోళన…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

023195
Total views : 141392

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.