Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Sports ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఘన విజ‌యం..!

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఘన విజ‌యం..!

by Satya
Lucknow Super Giants great victory

ల‌క్నో వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్(Mumbai Indians) తో జ‌రిగిన మ్యాచ్‌(Match)లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్(Lucknow Super Giants) సునాయాస విజ‌యం సాధించింది. ముంబై నిర్దేశించిన 145 ప‌రుగుల స్వ‌ల్ప‌ లక్ష్యాన్ని 4 బంతులు మిగిలి ఉండ‌గానే ఛేదించింది. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో స్టొయినిస్ 62 పరుగులతో రాణించాడు. కెప్టెన్ కేఎల్‌ రాహుల్ 28, దీపక్ హూడా 18 ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌నిపించారు. ముంబై బౌల‌ర్ల‌లో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. తుషార‌, న‌బీ, కోయెట్జీ తలో వికెట్ తీశారు. టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్‌కి దిగిన ఎంఐ త‌డ‌బ‌డింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 144 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

Follow us on : FacebookInstagramYouTube & Google News

నెహాల్ వ‌ధేరా 46, ఇషాన్ కిష‌న్ 32, టీమ్ డేవిడ్ 35 ప‌రుగులు చేశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా గోల్డెన్ డ‌కౌట్ అయ్యాడు. రోహిత్ శ‌ర్మ 4, తిల‌క్ వ‌ర్మ 7, సూర్య‌కుమార్ యాద‌వ్ 10… స్వ‌ల్ప స్కోర్ల‌కే పెవిలియ‌న్ చేరారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో మోసిన్ ఖాన్ 2, న‌వీన్ ఉల్ హ‌క్‌, ర‌వి బిష్ణోయ్‌, మ‌యాంక్ యాద‌వ్‌, స్టొయినిస్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు. ల‌క్నో 19.2 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ విక్ట‌రీలో కీల‌క పాత్ర పోషించిన స్టొయినిస్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. పాయింట్ల ప‌ట్టిక‌లో ల‌క్నో మూడో స్థానానికి ఎగ‌బాకింది. ముంబై ఇండియ‌న్స్ ప్లేఆఫ్ ఆశ‌లు సంక్లిష్టం అయ్యాయి.


  • మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
    బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్‌–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
  • ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
    ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్‌ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
  • బ్రిక్స్ సదస్సు సందర్భంగా పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.
    బ్రిక్స్ సదస్సు-2026 నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, పుతిన్‌కు ఒక విశిష్టమైన సాంస్కృతిక కానుకను అందజేశారు. ప్రాచీన తమిళ సాహిత్య గ్రంథమైన…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: