మాజీ మంత్రి బొత్స పై విజయవాడలో ఏసీబీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యతోపాటు బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాము ఏసీబీకిచ్చిన ఫిర్యాదును తీసుకుని రశీదు ఇచ్చారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. అవినీతి చేసిన మంత్రులందరూ తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. టీచర్ల వద్ద నుంచి 3 నుంచి 6 లక్షల రూపాయల వరకు ముడుపులు ముట్టాయని తెలిపారు. సుమారు 65 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. బొత్స హయాంలో జరిగినంత మోసం ఎప్పుడూ ఎక్కడా జరగలేదన్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చాక టీచర్ల బదిలీలు చేశారని మండిపడ్డారు. 1600 నుంచి 2500 మంది టీచర్లు మంత్రి, పేషీ ఘనాపాటీలపై దాడికి సిద్ధంగా ఉన్నారని వర్ల రామయ్య అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి భాగోతమంతా ఒక్కొక్కటిగా బయటకు వస్తోందన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- విజయవాడ కలెక్టరేట్లో చంద్రబాబుతో పవన్ భేటీవిజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనసేనాని ఇటీవల తాను సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళం ప్రకటించిన కోటి రూపాయల తాలూకు చెక్కును ముఖ్యమంత్రికి…
- వినాయక చవితి పండుగ వేళ తిరుమలలో విషాదం..వినాయక చవితి పండుగ వేళ తిరుమలలో విషాదం నెలకొంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న భక్తురాలు ఝాన్సీ గుండెపోటుతో కుప్పకూలింది. అక్కడే ఉన్న తోటి భక్తులు, ఆమె తండ్రి అయోమయానికి గురయ్యారు. ఇంతలో వైద్య…
- ముంపు కష్టాలు వీడేలా .. అభయమివ్వు గణేశావినాయక చవితి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.