జగిత్యాల మున్సిపాలిటీ(Jagityala Municipality)లో భూకుంభకోణం కేసు(Land Scam Case)లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణంలో నిందితులుగా అమిరుద్దీన్, ముజాకీర్ లతో పాటు మునిసిపల్ రెవెన్యూ అధికారి బడుగు ప్రసాద్ గా పోలీసులు గుర్తించారు. జగిత్యాల పట్టణం హస్నాబాద్ లో 12 గుంటలకు నకిలీ పత్రాలు సృష్టించి, ఆ భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులను సమానంగా పంచునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితురాలు కీర్తివిజయ లక్ష్మి ఫిర్యాదుతో ఈ భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో దీర్ఘకాలిక సెలవులలో మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు, మరో నిందితుడు ఇమ్రాన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. నిందితులపై 409, 420, 467, 471, 468, 120(b), r/w34 ఐపీసీ క్రింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ హనుమంతు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బందికి సంబంధించిన హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్…
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరికుప్పం పట్టణంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు . కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు…
- రాజధాని అమరావతి పునర్నిర్మాణం పై సీఎం స్పెషల్ ఫోకస్ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టిపెట్టింది. సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం, ఎన్డీయే ప్రభుత్వం తాజా బడ్జెట్లో అమరావతి అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో లాండ్ పూలింగ్ మళ్లీ ప్రారంభమైంది.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.