Sunday, April 26, 2026
News Navigation
Sunday, April 26, 2026
News Navigation

Breaking

Sunday, April 26, 2026
Home Andhra Pradesh నీట్ పేపర్ లీక్ పై వైఎస్ షర్మిల విజయవాడలో ధర్నా

నీట్ పేపర్ లీక్ పై వైఎస్ షర్మిల విజయవాడలో ధర్నా

by Satya
నీట్ పేపర్ లీక్ పై వైఎస్ షర్మిల విజయవాడలో ధర్నా

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టిన పీసీసీ నేతలు. నీట్ పేపర్ లీక్ పై వైఎస్ షర్మిల విజయవాడలో ధర్నా లో మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలు ఆడుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరించింది . ఆధారాలతో సహా పేపర్ లీక్ అయినట్లు బయటకు వచ్చాయి. ఇప్పటి వరకు ఎన్టిఏ ఎందుకు స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వ హస్తం కూడా నీట్ స్కాంలో ఉంది. కామన్ సెన్స్ లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది . లేటుగా వచ్చినందుకు గ్రెస్ మార్కులు ఇచ్చామని సిగ్గు లేకుండా సమర్ధించు కుంటున్నారు. నీట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ మందికి టాప్ మార్కులు ఎలా వచ్చాయి . 67 మంది టాపర్స్ గా నిలవడం అస్సలు ఎలా సాధ్యం అవుతుంది .

ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్ మీద లేదా . ఎన్నికల టైం చూసుకుని ఎన్టిఏ టైం చూసుకుని ఫలితాలు విడుదల చేసింది. సుప్రీం ఆదేశాలు కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తారా. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం వెనుక మీ హస్తం ఉందేమో అన్న అనుమానం కలుగుతుంది. కేంద్ర విద్యా శాఖ మంత్రి మోది జపం మానేసి పేపర్ లీక్ ఘటనపై సమాధానం చెప్పాలి . నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై పవన్ కళ్యాణ్,చంద్రబాబు సమాధానం చెప్పాలి .బీజేపీ ఎందుకు ఎవ్వరూ ప్రశ్నించడం లేదు. పేపర్ లీకేజీ ఘటనలపై సీబీఐ విచారణ జరిపి మళ్ళీ పరీక్ష నిర్వహించాలి ప్రశ్నించారు .

Follow us on : Facebook, InstagramYouTube & Google News

  • అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..
    అంతరిక్ష పరిశోధన రంగంలో తెలంగాణ మరో అద్భుత మైలురాయిని అధిగమించింది. హైదరాబాద్ వేదికగా రూపుదిద్దుకున్న దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఈ రాకెట్ ఫ్లైట్ హార్డ్‌వేర్‌ను శ్రీహరికోటకు జెండా ఊపి పంపారు ముఖ్యమంత్రి రేవంత్…
  • ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..
    సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమా అంతా కూడా తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని…
  • కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..
    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వేలాది ఎకరాల్లో పండిన వరి పంట కోత దశలో ఉన్నా, డీజిల్ కొరత కారణంగా కోతలు నిలిచిపోతున్నాయి. బంకుల వద్ద రైతులు డీజిల్ కోసం డబ్బాలతో…
  • భద్రాచలంలో ముఖ్యమంత్రి ఫ్లెక్సీలకు అవమానం..
    భద్రాచలం పట్టణంలో పంచాయతీ సిబ్బంది అత్యుత్సాహం పెను వివాదానికి దారితీసింది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కటౌట్లను డంపింగ్ యార్డ్‌లో పడేసి ఘోరంగా అవమానించారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది చెత్తకుప్పలో పడేయడంపై…
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
    ప్రభుత్వం ప్రజల వద్దకే వచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రావిగూడెం గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లోని దీర్ఘకాలిక సమస్యలకు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

008195
Total views : 54074

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.