బొగ్గు గనుల వేలంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ఎక్స్ వేదికగా ట్వీట్ల యుద్ధం సాగింది. ‘రేవంత్ గారూ’ అని కేటీఆర్ ట్వీట్ చేసి ప్రశ్నిస్తే… ‘కేటీఆర్ గారూ’ అంటూ రేవంత్ రెడ్డి ప్రతిస్పందించారు.
పీసీసీ అధ్యక్షుడిగా 2021లో మీరు బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని, 4 బ్లాక్లను సింగరేణికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం గుర్తుంచుకోవాలంటూ నాడు రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ను రీట్వీట్ చేస్తూ గుర్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని… కానీ అప్పుడు వేలాన్ని వ్యతిరేకించి, ఇప్పుడు వేలం పాట కోసం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను పంపించడం ఏమిటని విమర్శించారు. మీలో మార్పుకు గల కారణాలు చెప్పాలని నిలదీశారు.
బొగ్గుగనుల వేలంపై కేటీఆర్ ట్వీట్కు రేవంత్ రెడ్డి రీట్వీట్ చేస్తూ సమాధానం ఇచ్చారు. పదేళ్లుగా మీరు తెలంగాణ ఏం చెబుతుందో పట్టించుకోలేదని… ఇప్పుడు కూడా మీది అదే ధోరణి అని కేటీఆర్ను ఉద్దేశించి విమర్శించారు. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు, కేడర్ అంతా కేంద్ర ప్రభుత్వ, గత కేసీఆర్ ప్రభుత్వ ప్రైవేటీకరణను వ్యతిరేకించిందని పేర్కొన్నారు. సింగరేణి మొదటి, రెండో బ్లాక్లను కేంద్రం విక్రయించినప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నారని… నాడు అరబిందో, అవంతిక కంపెనీలకు విక్రయించారన్నారు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రైవేటీకరణను వ్యతిరేకించలేదని విమర్శించారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సింగరేణి బ్లాక్ల ప్రైవేటీకరణను, వేలాన్ని వ్యతిరేకిస్తున్నారని… అదే సమయంలో అవంతిక, అరబిందోలకు విక్రయించిన బొగ్గు బ్లాక్లను రద్దు చేసి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. బొగ్గుగనుల వేలంపై కేటీఆర్ ట్వీట్కు రేవంత్ రెడ్డి రీట్వీట్ చేసారు . తెలంగాణ ప్రజలు, వారి ప్రయోజనాలు, ఆస్తులు, హక్కులు, భవిష్యత్తు… కాంగ్రెస్తోనే సురక్షితమన్నారు. మన బొగ్గు గురించి మాత్రమే కాదు… ప్రజల ప్రతి హక్కు గురించి పోరాడుతామన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్హౌస్కు చేరుకున్నారు. యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ట్రంప్ రెండ్రోజుల చైనా పర్యటన ముగిసింది. ఒప్పంద ప్రకటనలేవీ లేకుండానే ఈ పర్యటన ముగిసింది. ఐతే కీలకాంశాల్లో ఏకాభిప్రాయాలు కుదిరాయని, ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కీలక పురోగతి…
- ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య నెలకొన్న సుదీర్ఘ ఘర్షణలకు ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాలు తమ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో మూడు వారాల పాటు పొడిగించేందుకు అంగీకరించాయి. ఈ విషయాన్ని అమెరికా…
- వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది. డెలివరీ కోసం వచ్చే గర్భిణీల ప్రాణాలతో వైద్య సిబ్బంది చెలగాటం ఆడుతున్నారు. తాజాగా ఒక బాలింత విషయంలో వైద్యులు చేసిన నిర్లక్ష్యం ఆమె…
- జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల మున్సిపాలిటీ 7వ వార్డులో ఉన్న పిల్లిగుండ్ల కాలనీ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. దాదాపు 18 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ కాలనీలో ఇప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రాకపోవడం స్థానికులను తీవ్ర ఇబ్బందులకు…
- యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్తో మోదీ భేటీ …ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబికి చేరుకున్నారు. మోదీ విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించగానే, ఆ దేశానికి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు ఎస్కార్ట్గా వచ్చి అరుదైన గౌరవాన్ని అందించాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 78364