Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra PradeshWest Godavari అంగరంగ వైభవంగా గోదావరికి అఖండ హారతి..

అంగరంగ వైభవంగా గోదావరికి అఖండ హారతి..

by Rama
Mangala Harathi

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వశిష్ట గోదావరికి విశ్వ విందు పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖండ హారతి పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. నాసిక్, వారణాసి నుంచి విచ్చేసిన పీఠాధిపతులు, స్వామీజీలు మహా మండేశ్వరులు గోదావరిలో పంటు పై పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ గోదావరి మాతకు, గట్టుపై కొలువైన అమరేశ్వర స్వామికి అఖండ హారతులు ఇచ్చారు. ముందుగా అమరేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య నదిలో పసుపు, కుంకుమ, పూలు జల్లుతూ అఖండ హారతి ఇచ్చారు. ఈ హారతిని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. గోదావరి పవిత్రత విశిష్టతను దేశ ప్రజలకు తెలియజేసేందుకు సుమారు 150 మంది పీఠాధిపతులు, సాధువులు మహా మండేశ్వరుడు నాసిక్ నుంచి ప్రదక్షణ యాత్ర చేపట్టారు. ప్రధాన రేవుల్లో గోదావరికి హారతులు నర్సాపురం విచ్చేశారు. శనివారం భక్తులకు దర్శనమిచ్చి పట్టణంలో పాదయాత్ర చేయనున్నారు.

Advertisements

You may also like

Our Visitor

013871
Total views : 78244

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.