తాడేపల్లిగూడెం(Tadepalligudem)లో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు పవన్ కల్యాణ్(Pawan Kalyan) హాజరయ్యారు. కూటమిలో బలమైన నాయకత్వం ఉందని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు(Chandrababu), మూడున్నరేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) వంటి నేతలు కూటమిలో ఉన్నారని వివరించారు. ముఖ్యంగా, మీ కష్టాలను మోస్తున్న నేనున్నాను అని వ్యాఖ్యానించారు. తాను ఎక్కడికి వెళ్లినా కూటమి ప్రభుత్వం వస్తుందని ప్రజలే చెబుతున్నారని వెల్లడించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ప్రజలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ వైసీపీ ప్రభుత్వం అన్ని కులాలకు ద్రోహం చేస్తోందపి ఆరోపించారు. యువత భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుకోవద్దని సూచించారు. సుమారు 70 కోట్ల వరకు ట్యాక్స్ కట్టాను. దాచిపెట్టేవాడ్ని కానని జనసేనాని తెలిపారు. సుఖాలను వదులుకుని రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నానంటే… ప్రజల పక్కన అండగా నిలబడేవారు ఎవరు? చంద్రబాబు గారు జైల్లో ఉంటే ధైర్యంగా వెళ్లింది ఎవరు? ఆ ధైర్యం జనసేనకే ఉంది, పవన్ కల్యాణ్ కే ఉందని జనసేనాని తెలిపారు.
- భారీ వర్షాలకు పెరుగుతోన్న గోదావరి ఉధృతిగోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో క్షణక్షణానికీ ప్రవాహం పెరుగుతోంది. ఏపీలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.20 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అన్ని గేట్లు ఎత్తి 13.27…
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సురేష్ గోపితిరుమల శ్రీవారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం అర్చన సేవలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ…
- తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబుప్రజల కోసం తాను జీవితాంతం పని చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు అండగా ఉంటానని హామీ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.