రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

Advertisements

<p>ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు&period; కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన&period;&period;భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు&period; రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్‌ కల్యాణ్‌&period;&period;ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు చేయించుకున్నారు&period; రొటేటర్ కఫ్ గాయంతోపాటు భుజానికి సంబంధించిన రెండు కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారించారు&period;&period; వెంటనే శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉంటుందని సూచించారు&period;&period; అయితే&comma; ముందుగానే నిర్ణయించిన పలు పాలనాపరమైన&comma; అధికారిక కార్యక్రమాలు ఉండడంతో&period;&period; కాస్త గ్యాప్ తీసుకున్న పవన్ కల్యాణ్&period;&period; ఇప్పుడు చికిత్స చేయించుకోవడానికి రేపు ముంబై వెళ్లనున్నారు&period; ఐతే చికిత్స పూర్తయిన తరువాత కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు&period; ఈ నేపథ్యంలో ఆయనకు చికిత్స పూర్తైయిన తర్వాత అధికారిక కార్యక్రమాలకు తాత్కాలికంగా విరామం ఇవ్వనున్నట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.