అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

Advertisements

<p>ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు&period; స్వర్ణాంధ్ర–2047 థీమ్‌తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80à°µ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు&period;సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా వేడుకల ప్రాంగణానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా&comma; ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు&period; అనంతరం ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు&period;ఆ తర్వాత పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన చంద్రబాబు&&num;8230&semi; ఏపీఎస్పీ సహా వివిధ పోలీసు బలగాల సన్నద్ధతను సమీక్షించారు&period; పోలీసు దళాలు&comma; ఎన్సీసీ క్యాడెట్లు&comma; సీఆర్పీఎఫ్‌తో పాటు కర్ణాటక పోలీసు దళం నిర్వహించిన మార్చ్‌పాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది&period;రాజధాని అమరావతిలో తొలిసారి నిర్వహించిన ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు&&num;8230&semi; స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాలకు ప్రతీకగా&comma; రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఘనంగా సాగాయి<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.