భారత సంతతి వ్యోమగామి కెప్టెన్ సునీతా విలియమ్స్(Sunita Williams) మరోసారి అంతరిక్షయానం చేయనున్నారు. మే 7న భారత కాలమానం ప్రకారం ఉదయం 8.34 కు కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్ష నౌక బోయింగ్ స్టార్లైనర్ ద్వారా ఆమె ప్రయాణించనున్నారు. మరోసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనుండడంపై సునీత విలియమ్స్ స్పందించారు.ఈసారి కాస్త ఆందోళనగా ఉందని, అయితే ప్రయాణంపై అంత భయం లేదని అన్నారు. లాంచ్ ప్యాడ్ వద్ద శిక్షణ సమయంలో ఆమె ఈ మేరకు మాట్లాడారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరోసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించడం సొంత ఇంటికి తిరిగి వెళ్తున్నట్టుగా అనిపిస్తోందని అన్నారు. కాగా వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి ఆమె ఈ ప్రయాణం చేయనున్నారు.ఈ అంతరిక్షయానంతో హ్యుమన్-రేటెడ్ అంతరిక్ష నౌక ద్వారా ప్రయాణించనున్న తొలి మహిళగా సునీత విలియమ్స్ నిలవనున్నారు. కాగా గతంలో ఆమె 2006, 2012లలో రెండుసార్లు అంతరిక్షానికి వెళ్లారు. మొత్తం 322 రోజులు ఆమె అంతరిక్షంలో గడిపి చరిత్ర సృష్టించారు. అత్యధికంగా 50 గంటల 40 నిమిషాలపాటు స్పేస్ వాక్ చేసిన మహిళగా కూడా ఆమె రికార్డు సృష్టించారు.
- అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్న జో బైడెన్అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్న జో బైడెన్ ప్రకటించడంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అధ్యక్ష పదవికి పోటీ పడే అర్హత బైడెన్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా దేశానికి సేవలు అందించడానికి ఫిట్ కాదని వ్యాఖ్యానించారు. ఈ…
- మైక్రో సాఫ్ట్ సాఫ్ట్ వేర్ లో సాంకేతిక లోపంమైక్రో సాఫ్ట్ సాఫ్ట్ వేర్ లో సాంకేతిక లోపం సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ప్రస్తుతం బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ బారిన పడుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ స్ట్రైక్ ఒక అప్డేట్ను విడుదల…
- అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్ పాజిటివ్అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన రిలీజ్ చేసింది. అధ్యక్షుడు స్వల్ప దగ్గు, జలుబుతోపాటు జ్వరంతో బాధపడుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం బైడెన్ డెలావేర లోని సముద్రతీరంలో ఉన్న…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.