andhra pradesh
అమరావతి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్ జూలై- అక్టోబర్,2023 లో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్న సీఎం ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా క్రింద ఇప్పటి వరకు 46,062 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 348.84 కోట్లు జమ చేసిన ప్రభుత్వం.
విశాఖలో ఘోర ప్రమాదం జరిగింది. ఆటోలో స్కూల్కు వెళుతున్న చిన్నారుల్ని లారీ ఢీకొట్టింది. ఆటోలో ఉన్న చిన్నారులు రోడ్డుపై చెల్లచెదురుగా పడిపోయారు. దీంతో బీతావహ వాతావరణం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చిన్నారులు బేతానీ స్కూల్ విద్యార్థులుగా గుర్తించారు. ఘటనాస్థలంలో హృదయవిదారక దృశ్యాలు కనిపించాయి. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారులు ప్రమాదానికి గురి కావడంతో స్థానికులు వెంటనే స్పందించారు. చిన్నారులకు ప్రాథమిక చికిత్స అందించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ ఘటనా స్థలం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రమాద స్థలంలో రోడ్డుపై చిన్నారులు చెల్లచెదురుగా గాయాలతో పడి ఉండటం అందరిని కలిచి వేసింది. కొందరు అపస్మారక స్థితికి చేరుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని మిషన్ హై స్కూల్ రోడ్లో . అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో కూల్ డ్రింక్ షాప్ దగ్ధమైంది . జనసేన పార్టీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న చించినాడ శ్రీనివాస్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో సకాలంలో మంటల్ని అదుపు చేశారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నారు .ఆస్తి నష్టం 3 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించింది. వాదనలు విన్న పిమ్మట ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఇటీవల చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ ఇవ్వగా, ఆ బెయిల్ గడువు నాలుగు వారాలుగా న్యాయస్థానం పేర్కొంది. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో, చంద్రబాబు ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లనక్కర్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర బెయిల్ సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని వివరించింది. చంద్రబాబు నవంబరు 29 నుంచి రాజకీయ సభలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ నెల 30న చంద్రబాబు విజయవాడలో ఏసీబీ కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. తన చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది.
కాకినాడ జిల్లా…
కాకినాడ రూరల్ సముద్రంలో మత్స్యకారులు ఇద్దరు గల్లంతు. మంగళవారం వేకువఝామునే ఐదుగురు వేటకు వెళ్లినట్లు మత్స్య శాఖ అధికారులు వెల్లడించారు. ముగ్గురు క్షేమంగా బయటకు వచ్చారు. మిగిలిన ఇద్దరు సముద్రంలో పడిపోయారని బయటకి వచ్చిన వారు తెలియజేసారు. దీంతో మత్స్యశాఖ అధికారులు అక్కడికి చేరుకుని అధికారులకు సమాచారం ఇచ్చారు .ఆ ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన వారు సూర్యాపేటకు చెందిన గరికెన సత్తిరాజు వయసు56, దుమ్ములపేటకు చెందిన మైలపల్లి కృప దాసు వయసు 35…
టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ రావడంతో బిగ్ రిలీఫ్, AP, తెలంగాణలో పాలాభిషేకాలు చేస్తూ శ్రేణుల సంబరాలు స్కిల్ కేసులో బాబుపై ఆరోపణలే తప్ప.. ఆధారాల్లేవ్ అన్న న్యాయస్థానం 149 సాక్షులు, 4వేల పేజీల డాక్యుమెంట్లు అంతా తుస్సని తేల్చిన హైకోర్టు సత్యం గెలిచింది.. అసత్యంపై యుద్ధం మొదలైందన్న లోకేశ్ ఇక ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న టీడీపీ అధినేత, యువనేత ఇంకా చాలా కేసులు ఉన్నాయంటూ కడుపు ఉబ్బరం బయటపెట్టిన సజ్జల చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే తమకు జింతాత..జింతాతే..అంటూ వైసీపీలో టెన్షన్.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం లో అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఆటోమొబైల్ షాపు
గన్నవరం లోని స్థానిక సినిమా థియేటర్స్ సెంటర్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ లలో ప్రమాదవశాత్తు ఆటోమొబైల్ షాపులో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ శ్రీనివాస ఆటోమొబైల్ షాపు యజమాని మడతల గురువారెడ్డి గా గుర్తింపు. గన్నవరం బీట్ పోలీసుల సహాయంతో సమాచారం అందుకున్న గన్నవరం అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకుని మంటలను అదుపు చేశారు. పూర్తిగా దగ్ధమైన ఆటోమొబైల్ షాపులోని స్పేర్ పార్ట్స్ సామాన్లు. అర్ధరాత్రి కావడంతో మూసివేసిన ఆటోమొబైల్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరాగడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న గన్నవరం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ప్రజలకు పాలన మరింత చేరువ చేస్తూ పాలనా వికేంద్రీకరణ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పల్నాడు జిల్లా ఏర్పాటు…
- పిడుగురాళ్ల మండలం కామేపల్లిలో రూ. 500కోట్లతో 47.53 ఎకరాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు
- నాడు – నేడు క్రింద 32 పీహెచ్ సీల ఆధునికీకరణ.. కొత్తగా 7 పీహెచ్ సీ భవనాల నిర్మాణం….
- పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు రూ.200 కోట్లతో గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ఏర్పాటు
- ఇండో-ఇజ్రాయెల్ టెక్నాలజీతో సాగులో సరికొత్త విధానాలు, సాంకేతికతను తీసుకొస్తూ రూ. 10.69కోట్ల అంచనా వ్యయంతో 26 ఎకరాల విస్తీర్ణంలో నెకరికల్లులో ఉద్యానవన ఉత్పత్తి కేంద్రం
- 100 ఏళ్ల తర్వాత చేపట్టిన రీసర్వేలో భాగంగా జగనన్న భూహక్కు మరియు జగనన్న భూ రక్ష కార్యక్రమం ద్వారా 107 గ్రామాల్లో 5,35,866 ఎకరాల్లో రీసర్వే పూర్తి చేసి 2,72,000 హద్దు రాళ్ళు ఏర్పాటు, 88,542 మంది లబ్ధిదారులకు భూహక్కు పత్రాల జారీ..
- జిల్లా వ్యాప్తంగా 97 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం..
జిల్లా వ్యాప్తంగా 32,624 మంది లబ్ధిదారులకు 90,864 ఎకరాల భూమి యాజమాన్య హక్కు పత్రాలు సీఎం చేతుల మీదుగా జారీ, నిషేధిత జాబితా నుండి చుక్కల భూములు మరియు సెక్షన్ 22 ఏ క్రింద నమోదైన భూముల తొలగింపు, పేదలకు అసైన్డ్, ఇనామ్, లంక భూములు, భూ కొనుగోలు పథకం క్రింది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూములకు వర్తింపు
రోడ్లు, భవనాల శాఖ ద్వారా రూ. 278.28 కోట్ల వ్యయంతో పెదకూరపాడు వద్ద బ్రిడ్జి నిర్మాణంతో పాటు 6 రహదారుల పనులు.. - రూ.412.36 కోట్ల వ్యయంతో మాచర్ల – దాచేపల్లి (జాతీయ రహదారి నం. 167డి), నాగార్జున సాగర్- దావులపల్లి (జాతీయ రహదారి నం, 565), వాడరేవు – పిడుగురాళ్ల (జాతీయ రహదారి నం. 167 A), కొండమోడు – పేరేచర్ల (జాతీయ రహదారి నం. 167 AG) పరిధిలో 220.61. కి. మీ నిడివితో 4 జాతీయ రహదారుల నిర్మాణం.
ఈ 54 నెలల కాలంలో జిల్లా వ్యాప్తంగా సంక్షేమ పథకాల రూపంలో రూ.8,812 కోట్ల ప్రత్యక్ష
నగదు లబ్ధి(డీబీటీ) అందించటమే కాకుండా నాన్ డిబీటీ క్రింద రూ. 3,087 కోట్ల లబ్ధి
అందించిన జగనన్న ప్రభుత్వం.. మొత్తంగా డీబీటీ, నాన్ డిబీటీల ద్వారా 36,12,980 మంది
లబ్ధిదారులకు అందించిన మొత్తం లబ్ధి అక్షరాల రూ. 11,900 కోట్లు,,