ప్రతి పౌరుడికి యూనిఫైడ్ కార్డ్ -సీఎం రేవంత్‌..

ప్రతి పౌరుడికి యూనిఫైడ్ కార్డ్ -సీఎం రేవంత్‌

Advertisements

<p>రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా &OpenCurlyQuote;సమగ్ర సంక్షేమ కార్డును రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ&period;రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు&period; ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా&comma; ఏ పథకం కింద&comma; ఎంత మేర లబ్ధి చేకూరుతోందో ఈ కార్డ్ ద్వారా స్పష్టంగా తెలిసేలా ఉండాలని సూచించారు&period; తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని&comma; అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు&period;<&sol;p>&NewLine;<p>మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు&comma; సీఎస్ రామకృష్ణారావు&comma; సీఎం స్పెషల్ సెక్రటరీ బి&period;అజిత్ రెడ్డి&comma; ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తదితర ఉన్నతాధికారులతో సీఎం ఈ విషయాన్ని ప్రత్యేకంగా సమీక్షించారు&period; సమగ్ర సంక్షేమ కార్డ్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకేచోట అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి అన్నారు&period; ఈ డేటాను అన్ని కోణాల్లో ఏఐ సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందన్నారు&period; నిజమైన అర్హులకు పథకాలు మరింత ఖచ్చితంగా చేరుతాయన్నారు&period; అదే సమయంలో అనర్హులను గుర్తించడం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు&period; ప్రతి శాఖ వేర్వేరుగా కార్డులు ఇచ్చే పద్ధతికి బదులు&comma; ఐటీ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర సంక్షేమ కార్డ్ ఉండాలని సీఎం సూచించారు&period; టెక్నాలజీపై పట్టున్న&comma; చురుగ్గా పనిచేసే యువ ప్రభుత్వ అధికారులను ఈ ప్రక్రియకు వినియోగించాలని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p>కేరళ నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లే ఉద్యోగులకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు&period; నైపుణ్యాభివృద్ధి&comma; శిక్షణ కార్యక్రమాలతో పాటు&comma; పాస్‌పోర్ట్‌లు&comma; వీసాల జారీకి సంబంధించిన సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంచితే&comma; అనధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుందని సీఎం తెలిపారు&period; పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా చేరేలా&comma; ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా సమగ్ర సంక్షేమ కార్డ్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..

ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..

రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మరీ జిల్లాలో సంచలనం రేపిన నలుగురి హత్య కేసు..