Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home TelanganaAdilabad మైనారిటీల లబ్ధి ఘనత కాంగ్రెస్ పార్టీదే – రావి.శ్రీనివాస్

మైనారిటీల లబ్ధి ఘనత కాంగ్రెస్ పార్టీదే – రావి.శ్రీనివాస్

by Rama
Ravi.Srinivas

దేశంలో మైనారిటీలకు ఏదైన లబ్ధి జరిగిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఘనతే అని అన్నారు సిర్పూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావి.శ్రీనివాస్. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కర్ణాటకలో తమ రాజకీయ స్వలాభం కోసమే బి.జె.పి పార్టీ మైనారిటీలపై ఆంక్షలు విధించింది అని అక్కడ జరిగిన ఎన్నికల పర్యావాసనాలు చవి చూడక తప్పులేదని గుర్తు చేశారు. దేశంలో మైనారిటీలకు ఏదైన లబ్ధి చేకూరిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ చొరవే అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వక్ఫబోర్డు ఆస్తుల రక్షణతో పాటు మైనారిటీ విద్యార్థులకు పూర్తి స్థాయి ఉచిత విద్యతో పాటు ఉన్నత చదువులు చదివేందుకు స్కాలర్ షిప్ లు అందిస్తామని అన్నారు. తెలంగాణలో అధికారం కోసం బి.జె.పి బి.ఆర్.ఎస్ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని అన్నారు. మరో మారు ఆ పార్టీలకు అవకాశమిస్తే కేంద్రంలో బి.జె.పి రాష్ట్రంలో బి.ఆర్.ఎస్ ల చేతిలో చావుదెబ్బ తప్పదన్నారు.

Advertisements

You may also like

Our Visitor

023129
Total views : 141100

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.