దేశంలో మైనారిటీలకు ఏదైన లబ్ధి జరిగిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఘనతే అని అన్నారు సిర్పూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావి.శ్రీనివాస్. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కర్ణాటకలో తమ రాజకీయ స్వలాభం కోసమే బి.జె.పి పార్టీ మైనారిటీలపై ఆంక్షలు విధించింది అని అక్కడ జరిగిన ఎన్నికల పర్యావాసనాలు చవి చూడక తప్పులేదని గుర్తు చేశారు. దేశంలో మైనారిటీలకు ఏదైన లబ్ధి చేకూరిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ చొరవే అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వక్ఫబోర్డు ఆస్తుల రక్షణతో పాటు మైనారిటీ విద్యార్థులకు పూర్తి స్థాయి ఉచిత విద్యతో పాటు ఉన్నత చదువులు చదివేందుకు స్కాలర్ షిప్ లు అందిస్తామని అన్నారు. తెలంగాణలో అధికారం కోసం బి.జె.పి బి.ఆర్.ఎస్ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని అన్నారు. మరో మారు ఆ పార్టీలకు అవకాశమిస్తే కేంద్రంలో బి.జె.పి రాష్ట్రంలో బి.ఆర్.ఎస్ ల చేతిలో చావుదెబ్బ తప్పదన్నారు.
Minorities
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలో పర్యటించారు. మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మైనార్టీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. గతానికి, ఇప్పటికి మధ్య తేడాలు గమనించాలన్నారు జగన్. గత ప్రభుత్వంలో మైనార్టీలను టీడీపీ గాలికొదిలేసిందన్నారు. డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను ఈ ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు. ముస్లింలలో పేదలందరికి వైఎస్సార్.. రిజర్వేషన్లు అమలు చేశారని సీఎం జగన్ గుర్తు చేశారు. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నామన్నారు. మైనార్టీలకు మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించామని సీఎం జగన్ చెప్పారు.
Read Also..
Read Also..
కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని, తమ అభిప్రాయాలను ఎవరైనా స్వేచ్ఛగా చెప్పొచ్చని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో అలాంటి ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించదని, తాను సీఎం అవుతానని హరీశ్రావుకు చెప్పే ధైర్యం లేదని, అలా చెప్పిన మరుక్షణం ఆయన జైలులో ఉంటారని చెప్పారు. నిర్వహించిన ‘క్వశ్చన్ అవర్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తరచూ సీఎంలను మార్చుతుందన్న అపవాదుపై రేవంత్ స్పందిస్తూ.. హిమాచల్ ప్రదేశ్, చత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని, అక్కడ సీఎంలు మారారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో ఉంటేనే ఉద్యమకారుడు.. లేదంటే తెలంగాణ ద్రోహి అనడం ఫ్యాషన్ అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఉద్యమకారులకు సీట్లు ఇస్తే.. వేలకోట్లు ఉన్న వారికి బీఆర్ఎస్ రాజ్యసభ సీట్లు ఇచ్చిందని విమర్శించారు. ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తాము 60 శాతం సీట్లు ఇచ్చామన్నారు. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లికి ఓడిపోయే సీటు ఇచ్చారన్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్కు అభ్యర్థులు లేరని ప్రచారం చేశారని, ఇప్పుడు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణిపై తొలి నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తున్న రేవంత్.. అంతర్జాతీయ నేరగాళ్లు ఉండే దేశాల నుంచి ధరణి పనిచేస్తోందని ఆరోపించారు. రెవెన్యూ రికార్డులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. వాటిని వారికి ఇచ్చే అధికారం కేసీఆర్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. హైదరాబాద్లోని కొందరు ధరణి వచ్చాక వందల ఎకరాలకు ఆసాములయ్యారని తెలిపారు. ఊళ్లలోని భూములను ఎప్పుడో అమ్మేసుకున్న వారి పేర్లు ఇప్పుడు రికార్డుల్లోకి ఎలా వచ్చాయని రేవంత్రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్నటి రోజు ధర్మవరంలో వైసీపీ నాయకులు చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర గురించి మాట్లాడుతు వైసీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు చేపడుతున్న యాత్ర సామాజిక సాధికార బస్సు యాత్ర కాదని అది కేవలం జగన్ రెడ్డి భజన యాత్రని కమ్మ కులస్తులను విమర్శించేందుకే ధర్మవరంలో ఈ బస్సు యాత్ర పెట్టారని కులాన్ని పెట్టి విమర్శించడం హేయమైన చర్యని అలాగే సామాజిక న్యాయం అంటే బీసీలను,మైనార్టీలను పీకి ఓసి మంత్రులకు ఇవ్వడమే సామాజిక న్యాయం అంటారా అంటూ బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరూ వారి యొక్క దొంగ యాత్రను గమనిస్తున్నారని 2024లో వారికి కచ్చితంగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.





Total views : 140933