ప్రపంచంలోనే విష్ణువు కూర్మావతారంలో ఉన్న ఏకైక ఆలయం ఇది.. ఎక్కడుందో తెలుసా?

Vishnu is Kurmaavatara

Advertisements

&NewLine;<p>మహావిష్ణువు అన్ని అవతారాల్లో దుష్ట శిక్షణ జరిగింది&period; కానీ కూర్మావతారంలో మాత్రం అలా కాలేదు&period; క్షీరసాగర మధనంలో కూర్మావతారం ధరించిన మహావిష్ణువు అదే అవతారంలో పూజలందుకుంటున్న ఆలయం ఈ ప్రపంచంలో ఒక్కటే ఉంది&period; ఆ ఆలయం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండడం విశేషం&period; ఎన్నో అరుదైన ప్రదేశాలకు&comma; విశేషాలకు నిలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు&period; ఆధ్యాత్మికంగా&comma; పర్యాటకంగా ఇక్కడి అనేక ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షిస్తుంటాయి&period; ఆ జాబితాలో చెప్పుకోదగ్గ అరుదైన ప్రదేశం &&num;8216&semi;శ్రీకూర్మం&&num;8217&semi;&period; మహావిష్ణువు కూర్మ రూపంలో ఉన్న ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే కావడం విశేషం&period; శ్రీకాకుళం పట్టణం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం గ్రామంలో ఈ అరుదైన దేవాలయం ఉంది&period; గర్భగుడిలో కొలువైన కూర్మనాధస్వామి విగ్రహం నుంచి ఆలయం వెలుపల గల నిర్మాణాల వరకూ ఇక్కడ ప్రతీదీ ప్రత్యేకమే&period; అసలు శ్రీకూర్మం యొక్క చరిత్ర ఏమిటి&quest; అక్కడి విశేషాలు ఏమిటి&quest; ఇప్పుడు తెలుసుకుందాం&period;<br>శ్రీకూర్మం చరిత్ర&colon;<br>శ్రీకూర్మం ఆవిర్భావానికి సంబంధించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు&period; కానీ పురాణాల కధనం ఈ విధంగా ఉంది&period; పూర్వం శ్వేతచక్రవర్తి అనే రాజు దక్షిణ సముద్ర తీరాన ఉండే శ్వేతపురమనే పట్టణంను పరిపాలించేవాడు&period; అతని భార్య విష్ణుప్రియ పరమ విష్ణు భక్తురాలు&period; ఓ రోజు ఏకాదశి వ్రత దీక్షలో ఉన్న ఆమె వద్దకు భర్త శ్వేత చక్రవర్తి కామమోహితుడై వస్తాడు&period; దీంతో భర్తను వేచి ఉండమని చెప్పి ఆమె పూజా మందిరంలో విష్ణువును ధ్యానిస్తుంది&period; ఓ వైపు భర్త&period;&period; మరో వైపు భక్తి&period;&period; ఈ సంకట స్థితి నుంచి తనను బయట పడేయాలని విష్ణువును వేడుకుంటుంది&period; క్షీరసాగర మదనంలో కూర్మరూపమున దేవతలను ఆదుకున్న విధంగా తనను ఆడుకోమని ప్రార్ధిస్తుంది&period; ఆమె మొర విన్న విష్ణువు అక్కడే గంగను ఉద్భవింపజేస్తాడు&period; ఆ గంగ ఉధృతంగా రాజు వైపు రావడంతో అతడు భయంతో పరుగిడి ఓ పర్వతం పైకి ఎక్కుతాడు&period; అక్కడ ఏం జరిగిందని మంత్రిని వివరములు అడగడంతో అతడు చెప్పింది విని పశ్చాత్తాపం చెందుతాడు&period; తనకు మరణమే శరణ్యమని దుఖిఃస్తున్న సమయంలో నారదుడు అటుగా వచ్చి శ్రీకూర్మ మంత్రమును జపించమని చెబుతాడు&period; ఈ గంగ వంశధార అనే పేరుతో సాగరంలో కలుస్తుందని&comma; ఇది సాగర సంగమ ప్రదేశమని సెలవిస్తాడు&period; శ్వేత చక్రవర్తి కూర్మ మంత్రంతో కొన్నేళ్ల పాటూ విష్ణువును పూజించగా ఓ రోజు మహావిష్ణువు కూర్మావతారంలో చక్రతీర్ధ గుండం నుంచి బయటకు వచ్చి దర్శనమిస్తాడు&period; దీంతో రాజు అక్కడే స్వామిని కొలువై ఉండాలని కోరగా విష్ణువు తన చక్ర ప్రయోగము చేసి ఓ వటవృక్షం వద్ద క్షీర జలంతో కూడిన కూర్మగుండంను సృష్టిస్తాడు&period; చక్రం వెళ్ళిన మార్గం నుంచి ప్రత్యక్ష్యమైన శ్రీమహాలక్ష్మితో కలిసి లక్ష్మి సమేత శ్రీకూర్మనాధునిగా స్వామి వారు అక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు&period;<br>ఆలయానికి శాపం&colon;<br>ద్వాపర యుగం కాలంలో బలరాముడు శ్రీకూర్మం దర్శనానికి వచ్చిన సమయంలో క్షేత్రపాలకుడైన బైరవుడు ఆయనను లోనికి అనుమతించడు&period; దీంతో ఆగ్రహానికి గురైన బలరాముడు భూమిపై మరెక్కడా కూర్మావతారంలో ఆలయం ఉండకూడదని శపిస్తాడు&period; అందువల్లే ప్రపంచంలో ఉన్న ఏకైక కూర్మావతార క్షేత్రంగా ఇది ప్రసిద్ధికెక్కినట్లు చెబుతారు&period;<br>ఆలయ విశిష్టతలు&colon;<br>శ్రీకూర్మంలో స్వామి వారి విగ్రహం పడమటి ముఖంగా ఉండడం విశేషం&period; ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు కనిపిస్తాయి&period; ఆలయంలో దొరికిన చారిత్రక ఆధారాల ప్రకారం 4వ శతాబ్ధానికి ముందే ఇక్కడ ఆలయం నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది&period; కళింగ&comma; ఆంధ్ర&comma; చోళ వంశాల కాలంలో ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేశారు&period; 7వ శతాబ్ధం నుంచి ఈ ఆలయ ప్రాముఖ్యత విస్తరించినట్లు చెబుతారు&period; గాంధర్వ శిల్ప సంపాద అని పిలువబడే స్తంభాలు ఆనాటి రాజుల పేర్లు&comma; కీర్తిని చాటిచెబుతాయి&period; ఆలయానికి వెలుపల శ్వేత పుష్కరిణి ఉంటుంది&period; అద్భుతమైన వాస్తు కళతో కనిపించే ఈ ఆలయంలో 108 ఏక శిలా రాతి స్తంభాలు కనిపిస్తాయి&period; అయితే వీటికి ఒక దానితో ఒకటి పోలిక లేకపోవడం విశేషం&period; ఆలయంలో ఒక రాతి పీఠంపై కూర్మనాధస్వామి దర్శనమిస్తారు&period; అడుగు ఎత్తు&comma; ఐదడుగుల పొడవు&comma; నాలుగు అడుగుల వెడల్పుతో స్వామి వారి విగ్రహం ఉంటుంది&period; నిత్యం స్వామి వారి విగ్రహం సింహాచలం అప్పన్న మాదిరిగా గంధపు పూతతో కనిపిస్తుంది&period; ఆలయ పరిసరాల్లో శ్రీవరదరాజ స్వామి&comma; శ్రీ రామానుజాచార్యులు&comma; శ్రీ మధ్వాచార్యులు&comma; కోదండరామస్వామి ఆలయాలు కూడా ఉంటాయి&period;<br>ఆలయ ప్రత్యేకతలు&colon;<br>విష్ణువు కూర్మావతారంలో ఉన్న ఏకైక స్వయంభు ఆలయం ఇది&period; ఈ ఆలయంలో నిత్యాభిషేకాలు జరుగుతుంటాయి&period; ప్రపంచంలో దుర్గామాత వైష్ణోదేవి రూపంలో ఉన్న రెండవ ఆలయం శ్రీకూర్మం&period; ఇక్కడికి వారణాశికి వెళ్లడానికి సొరంగ మార్గం ఉందని&comma; ప్రస్తుతం దీనిని మూసివేసినట్లు చెబుతారు&period; వారణాసి మాదిరిగానే చనిపోయిన వారి అంతిమ కర్మలను నిర్వహించే మోక్ష స్థానంగా శ్రీకూర్మంకు ప్రత్యేక గుర్తింపు ఉంది&period;<br>ఎలా వెళ్లాలి&colon;<br>ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం పట్టణంకు 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం ఉంది&period; ఇతరాల రాష్ట్రాలు&comma; ప్రాంతాల నుంచి విమానమార్గం ద్వారా వచ్చే ప్రయాణీకులు విశాఖపట్నం విమానాశ్రయంలో దిగి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది&period; విశాఖ నుంచి శ్రీకూర్మం 130 కిలోమీటర్ల దూరంలో ఉంది&period; శ్రీకాకుళం పట్టణం నుంచి ప్రతి 15 నిమిషాలకు ఇక్కడికి బస్సు రవాణా సౌకర్యం కలదు&period; ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఆలయం తెరిచి ఉంటుంది&period; బస్సు&comma; ఆటోలు&comma; ట్యాక్సీల ద్వారా పర్యాటకులు ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.

పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.

అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.