Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home TelanganaKhammam ఎదులాపురంలో ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్

ఎదులాపురంలో ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్

by Rama
kandala upendra reddy

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురంలో ఎన్నికల ప్రచారంలో పాలేరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. వీరికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ గ్రామంలో ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ నేను చేసేదే చెబుతా, చెప్పిందే చేస్తా, అబద్ధం చెప్పనని అన్నారు. నిన్నటి దాకా కేసీఆర్ దేవుడని, రాజకీయాల కోసం సీటు ఇవ్వలేదని ఇప్పుడు దెయ్యం అంటున్నారని అన్నారు. నేను కూడా 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి అన్ని పార్టీల సహాయంతో గెలిచానని ఎన్నడూ ఏ మాత్రంని తిట్టలేదని అన్నారు. నేను లోకల్ వాడిని అని, వ్యాపార నిమిత్తం హైదరాబాద్ వెళ్లి వస్తుంటానని, నన్ను నాన్ లోకల్ అంటున్నారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లోకల్ వాడు కాదని అన్నారు. కొందరు బయట వ్యక్తులు వచ్చి డబ్బులతో ఓటర్లని కొనాలని చూస్తున్నారు. ఈ ఎదులాపురం బొడ్డు రాయి దగ్గర కూర్చుందాం, ఎవరు ఎన్ని సార్లు వచ్చారు, ఎవరు ఏమీ అభివృధి చేశారో చూద్దామని అన్నారు. రాత్రికి రాత్రి పార్టీ మారి కాంగ్రెస్ వాళ్లు కమల్ హాసన్, నటరాజ్ లాగా యాక్షన్ చేస్తున్నారని అన్నారు. కావున ఈ గడ్డ బిడ్డనైనా నన్ను కారు గుర్తుపై ఓటు వేసే నన్ను గెలిపించాలని ఆయన అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

019579
Total views : 91168

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.