272
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజల ఆశీస్సులతో ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం 51 వ డివిజన్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ గౌడ్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి, తన నివాసం నుండి భారీ ర్యాలీగా డప్పు వాయిద్యాల బోనాల కోలాహలాల నడుమ కార్యకర్తలు అభిమానులతో కలిసి ఆర్డిఓ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.శంషాబాద్, రాజేంద్రనగర్, గండిపేట మండలం నుంచి గ్రామ గ్రామాన ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేస్తారని కళ్ళు కబుర్లు చెప్పే వారి మాటలు నమ్మకుండా న్యాయంగా పనిచేసే వారికే ప్రజలు పట్టం కడతారని ప్రకాష్ గౌడ్ అన్నారు






Total views : 75455