ఆలోచనలు వెర్రితలలు వేస్తే అది విపరీత ధోరణి అనుకుంటాం. కానీ ఆ స్థాయిని కూడా దాటిపోతే దాన్ని ఏమనాలి? ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. తనతో సన్నిహితంగా ఉంటున్న యువకుడిపై మోజు పడిన వ్యక్తి ఆ యువకుడికి తెలియకుండానే లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించిన ఘటన వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
ముజఫర్ నగర్ కు చెందిన 20 ఏళ్ల ముజాహిద్ అనే యువకుడు ఓం ప్రకాశ్ అనే వ్యక్తితో రెండేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఇటీవల యువకుడు అనారోగ్యానికి గురికాగా తాను ఆసుపత్రికి తీసుకెళ్తానంటూ ఓం ప్రకాశ్ ను ఆ యువకుడిని మన్సూర్ పూర్ లోని ఓ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి డాక్టర్లు ముజాహిద్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, ఓ శస్త్రచికిత్స చేయాలని సూచించారు. నిజమేనని నమ్మిన యువకుడు శస్త్రచికిత్సకు సిద్దమయ్యారు.
అయితే, వైద్యులు ముజాహిద్ కు లింగ మార్పిడి చేశారు. మత్తు మందు కారణంగా తనకు ఎలాంటి శస్త్రచికిత్స నిర్వహించారో ఆ యువకుడు గుర్తించలేకపోయాడు. ఆ తర్వాత ఓం ప్రకాశ్ వచ్చి ఇప్పుడు నువ్వు అమ్మాయిగా మారిపోయావు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, జీవితాంతం మనం కలిసే ఉండొచ్చు అని చెప్పాడు.
దాంతో దిగ్ర్భాంతికి గురైన ఆ యువకుడు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఓం ప్రకాశ్ ను అరెస్టు చేశారు.
కాగా, పెళ్లికి ఒప్పుకోకపోతే తన తండ్రిని చంపేస్తానంటూ ఓం ప్రకాశ్ బెదిరించాడని, తమ భూమిని కూడా లాక్కున్నాడని బాధిత యువకుడు ఆరోపించాడు.
ఈ ఘటనపై భారతీయ కిసాన్ యూనియన్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. నిందితుడు ఓం ప్రకాశ్ తో పాటు, లింగ మార్పిడి చేసిన బేగ్ రాజ్ పూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి డాక్టర్లనూ కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బాధాకరమైన ఘటనతో యువకుడు శారీరకంగా, మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నాడని, అతనికి రూ. 2 కోట్ల పరిహారం చెల్లించాలని కిసాన్ యూనియన్ నేతలు స్పష్టం చేశారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
- ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
- హైదరాబాద్లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.హైదరాబాద్ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ IREC-2026 హైదరాబాద్లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మూడు రోజుల పాటు ఈ…
- వైసీపీకి గుడ్బై చెప్పిన చిన్న శ్రీను.ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
- స్పీకర్పై వ్యాఖ్యల వెనుక ఫామ్హౌస్ కుట్ర: భట్టి.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.