సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసు

pravallika

Advertisements

&NewLine;<p>రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరాం రాథోడ్‌ నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు&period; వరంగల్‌ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవళిక హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని హాస్టల్‌ గదిలో ఈ నెల 13à°¨ బలవన్మరణానికి పాల్పడింది&period; ఈ ఘటనపై విద్యార్థులు&comma; విద్యార్థి సంఘాల ప్రతినిధులు&comma; కాంగ్రెస్‌&comma; బీజేపీ నేతలు ఆందోళనలకు దిగారు&period; గ్రూప్స్‌ పరీక్షల వాయిదా కారణంగా మానసిక ఒత్తిడితో ఆమె చనిపోయిందంటూ ఆరోపించారు&period; ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా&period;&period; శివరాం రాథోడ్‌ వ్యవహారం వెలుగుచూసింది&period; మృతురాలి సెల్‌ఫోన్‌ డేటాను పరిశీలించిన దర్యాప్తు అధికారులు ఆమెతో శివరాం చేసిన వాట్సప్‌ సందేశాలను గుర్తించారు&period; దీంతో అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు&period; ఈ నేపథ్యంలోనే శివరాం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రిజిస్ట్రేషన్లు తగ్గినా…తెలంగాణకు భారీ ఆదాయం..

ప్రజల ప్రాణాలకు ముప్పుగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్

మెదక్ హైవేపై కాలిబూడిదైన ప్రైవేట్ బస్సు..