కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటం చేస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు లోకనాథం హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ చేపట్టిన బస్సు యాత్ర మంగళవారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం చేరుకుంది .ఈ సందర్భంగా స్టీమర్ రోడ్ లో ప్రజా రక్షణ బేరీ పేరుతో నిర్వహించిన సభలో లోకనాథం మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి విధానాలకు తలొగ్గి జగన్ పాలన చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికలలో ఉద్యోగ కార్మికులకు ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలన్నీ నీటి మాటలగానే మిగిలాయని, నాలుగున్నర ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదంటూ. ఉన్న పరిశ్రమలే రాష్టం నుంచి తరలిపోతున్నాయని, దీనివల్ల నిరుద్యోగులకు ఉపాధి లేకుండా పోయిందని లోకనాథం జగన్ పాలనపై ఫైర్ అయ్యారు. ఈ సభలో రాష్ట్ర కమిటీ సభ్యులు మంతెన సీతారా జిల్లా కార్యదర్శి బలరాoలు పాల్గొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యతిరేకిస్తూ బస్సు యాత్ర..
361
previous post





Total views : 180908