Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra PradeshKrishana పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

by Satya
MLA Anil Kumar

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలం కోసూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. 3.47 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, 33/11 కరెంటు సబ్ స్టేషన్, ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రారంభించారు. పామర్రు నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీస్తోందని ఎమ్మెల్యే అన్నారు. సీఎం జగన్ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతూ సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాలకు అభివృద్ధిపై చర్చించే దమ్ము లేదని వైసిపి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అందుకే పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. 35 లక్షల నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి చరిత్ర సృష్టించామని ఎమ్మెల్యే అనిల్ కుమార్ స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Our Visitor

014170
Total views : 79420

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.