Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Andhra Pradesh సిఐటియు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికుల ధర్నా..

సిఐటియు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికుల ధర్నా..

by
Sanitation Workers

ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల శానిటేషన్ వర్కర్స్ సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్‌ సెంటర్ చౌక్‌ లో ధర్నా నిర్వహించారు.శానిటేషన్ వర్కర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడుతూ వేతనాలు పెంచాలి. ప్రతి నెల 5 వ తేదిలోపు వేతనాలు చెల్లించాలి. మున్సిపల్ స్కూల్స్లో పనిచేసే శానిటై జేషన్ వర్కర్లను మున్సిపల్ శాఖలో కొనసాగించాలి. బకాయి వేతనాలు చెల్లించాలి. శానిటేషన్ పరికరాలు (గౌజులు, మాస్క్ లు, శానిటేషన్, చీపుర్లు, ఫినాయిల్ సదుపాయాలు కల్పించాలి. రాజకీయ వేధింపులు ఆపాలి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ఇఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. ప్రమాద భీమా సౌకర్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పధకాలన్నింటినీ ఈ కార్మికులకు అమలు చెయ్యాలి. శానిటేషన్ కార్మికులందరినీ 4 వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. బాత్రూంలను ఫోటోతీసి యాప్లో అప్లోడ్ చేసే విధానాన్ని రద్దు చేయాలి.

Advertisements

You may also like

Our Visitor

036123
Total views : 180890

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.