కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను రాజకీయాల్లో కింది స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగానని ఇప్పటి వరకు ప్రజాబలంతో ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ ఏం చేస్తాడో నాకు తెలియదు నేను మాత్రం ఎన్నికల్లో పోటీ చేస్తాను అన్నారు. నా కొడుకు కూడా ప్రజాభిమానం పొంది రాజకీయాల్లో ఎదగాలని కోరుకుంటున్నా అని తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 10వ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ముందుగా పంచాయతీరాజ్ కార్యాలయం నుండి ప్రధాన కూడలి మీదుగా ర్యాలీ గా వచ్చి సోమప్ప సర్కిల్లో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణం కు చేరుకున్నారు. ర్యాలీలో ప్రస్తుతం కరువుతో రైతులు పడే కష్టాలు ఎద్దుల బండి కాడమోసి రైతు ఆత్మహత్య చేసుకునే దృశ్యాన్ని ప్రదర్శించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు. రాష్ట్రంలో కరువు తాండవమాడుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.ఈ కరువు తో వలసలు వెళుతు, రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న కనీసం వారి కష్టాలు కూడా తెలుసుకోలేని దుర్మార్గ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు అంత కలిసి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడం ఖాయమని సిపిఐ నేత రామకృష్ణ తెలిపారు.
అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 7వ రోజు కు చేరింది. ప్రకాశం జిల్లా మార్కాపురం లో ఏడో రోజు సమ్మెలో అంగన్వాడీలు ఎర్ర చీరలు ధరించి పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న అంగన్వాడీలను చూసి సబ్ కలెక్టర్ సేతు మాధవన్ కార్యాలయం నుండి బయటికి వెళ్లిపోయారు.ఈ సమ్మెలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్, సిఐటియు యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని 13 మండలాలకు చెందిన అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు
సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అంగన్వాడి సెంటర్ల తాళాలు పగలగొట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. అవసరమైతే సమస్యల సాధన కోసం త్వరలో రాజధానిని కూడ ముట్టడిస్తామని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ తెలిపారు.
ఈరోజు సుబ్రమణ్య షష్టి సందర్భంగా విసన్నపేట లోవెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 11 గంటలకు స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. షష్టి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పసుపులేటి సౌజన్య స్వామివారికి పట్టు వస్త్రములు సమర్పించినారు. మరియు షష్టి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారి పుట్టలో పాలు పోసి, స్వామివారికి పాలకావిడలు, పొంగలి సమర్పించి వేలాది భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. షష్టి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తుల కోసం ఆలయ కమిటీ నరసింహారావు, శ్రీనివాసరావు, రామవరపు దుర్గాప్రసాద్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణ మహోత్సవంలోగంధం కిషోర్, అత్తునూరి సతీష్ మొత్తం ఎనిమిది మంది దంపతులు మరియు తదితరులు కల్యాణంలో పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా ఆలయ సిబ్బంది దేవాలయానికి పూలతో ప్రత్యేక అలంకరణ చేసారు. షష్టి కళ్యాణ మహోత్సవం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
విజయవాడ లో యునైటెడ్ ఫుడ్ ప్యాలస్ రెస్టారంట్ ను సినీ నటి అనసూయ లాంఛనంగా ప్రారంభించారు. అనసూయ ను చూడడానికి అభిమానులు భారీ స్థాయిలో వచ్చారు. ఈ సందర్బంగా అనసూయ మాట్లాడుతూ విజయవాడ భోజన ప్రియుల రుచులకు అనుగుణంగా యునైటెడ్ ఫుడ్ ప్యాలస్ లో అన్ని రకాల వెరైటీ లు లభిస్తాయని, రెస్టారెంట్ విజయవంతం కావాలని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియచేసారు.
ఎన్టీఆర్ జిల్లా, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపి రాష్ట్ర కార్యదర్శి కొత్త నాగేంద్రకుమార్ (నాగబాబు) మీడియా సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ఇది ఆరోగ్యశ్రీ కాదు, అనారోగ్యశ్రీ అని అన్నారు. జగన్ రెడ్డి పాలనలో కార్పొరేట్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ పదకం పేదలకు దూరం అయ్యిందన్నారు. రూ 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పదకం అంటూ జగన్ రెడ్డి కొత్త ప్రచారానికి తెర తీశారు. కార్పొరేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ లో వైద్యం చేయలేమని నెల కిందటే కార్పొరేట్ యాజమాన్యాలు ప్రభుత్వానికి చెప్పినాయి. భారతమ్మ పత్రిక సాక్షికి, కూలీ మీడియా కి ఇచ్చే యాడ్స్ డబ్బులు కార్పోరేట్ హాస్పిటల్స్ కు బిల్ చెల్లిస్తే పేద ప్రజలకు వైద్యం అన్నా అందేది అని అన్నారు. 25 లక్షలు ఉచిత వైద్యం “పేరుగొప్ప – ఊరుదిబ్బ” చందాన వుంది.
ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల శానిటేషన్ వర్కర్స్ సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్ చౌక్ లో ధర్నా నిర్వహించారు.శానిటేషన్ వర్కర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడుతూ వేతనాలు పెంచాలి. ప్రతి నెల 5 వ తేదిలోపు వేతనాలు చెల్లించాలి. మున్సిపల్ స్కూల్స్లో పనిచేసే శానిటై జేషన్ వర్కర్లను మున్సిపల్ శాఖలో కొనసాగించాలి. బకాయి వేతనాలు చెల్లించాలి. శానిటేషన్ పరికరాలు (గౌజులు, మాస్క్ లు, శానిటేషన్, చీపుర్లు, ఫినాయిల్ సదుపాయాలు కల్పించాలి. రాజకీయ వేధింపులు ఆపాలి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ఇఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. ప్రమాద భీమా సౌకర్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పధకాలన్నింటినీ ఈ కార్మికులకు అమలు చెయ్యాలి. శానిటేషన్ కార్మికులందరినీ 4 వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. బాత్రూంలను ఫోటోతీసి యాప్లో అప్లోడ్ చేసే విధానాన్ని రద్దు చేయాలి.
మచిలీపట్నంలో రాజా గారు సెంటర్లో ఏర్పాటు చేసిన బార్గెట్లను వెంటనే తొలగించాలని అనేకమార్లు ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో జనసేన పార్టీ తరఫున గతవారం జిల్లా ఎడిషనల్ ఎస్పీ గారికి మరియు కలెక్టర్ గారికి గత మూడు సంవత్సరాలుగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆ బార్గెట్లను వెంటనే తొలగించాలని వారం రోజులు గడువిస్తూ కలెక్టర్ గారికి మరియు అడిషనల్ ఎస్పీ గారికి తెలియజేసినప్పటికీ వారు ఎటువంటి యాక్షన్ తీసుకో పోవడంతో మచిలీపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ బండి రామకృష్ణ(RK) గారు జనసేన నాయకులతో కలిసి ఈరోజు స్వయంగా బార్గెట్లను తొలగించి ప్రజలకు ఎప్పుడు జనసేన అండగా ఉంటది అని తెలియజేశార