Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh తాళాలు పగలగొట్టిన అధికారులపై చర్యలకు అంగన్వాడీల డిమాండ్

తాళాలు పగలగొట్టిన అధికారులపై చర్యలకు అంగన్వాడీల డిమాండ్

by
anganwadi workers strike

అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 7వ రోజు కు చేరింది. ప్రకాశం జిల్లా మార్కాపురం లో ఏడో రోజు సమ్మెలో అంగన్వాడీలు ఎర్ర చీరలు ధరించి పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న అంగన్వాడీలను చూసి సబ్ కలెక్టర్ సేతు మాధవన్ కార్యాలయం నుండి బయటికి వెళ్లిపోయారు.ఈ సమ్మెలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్, సిఐటియు యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని 13 మండలాలకు చెందిన అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు
సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అంగన్వాడి సెంటర్ల తాళాలు పగలగొట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. అవసరమైతే సమస్యల సాధన కోసం త్వరలో రాజధానిని కూడ ముట్టడిస్తామని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: