అంగన్వాడీ(Anganwadi) కేంద్రాల్లో పనిచేసే 65 ఏళ్లు నిండిన సిబ్బంది విషయంలో తెలంగాణ సర్కార్(Telangana government) సంచలన నిర్ణయం తీసుకుంది. వీరి పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత వివరాలను ఏప్రిల్ 30వ తేదీ నాటికి పంపించాల్సిందిగా మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఆదేశించారు. ఇక రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ సిబ్బందికి ఆసరా పింఛన్లు మంజూరు చేస్తామన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సిబ్బంది పుట్టిన తేదీని స్కూల్ బోనఫైడ్ సర్టిఫికేట్ లేదా టీసీ లేదా మార్కుల మెమో ప్రకారం గుర్తించాలని శిశు సంక్షేమశాఖ సూచించింది. ఒకవేళ ఈ ధ్రువీకరణ పత్రాలు లేకుంటే గుర్తింపు పొందిన జిల్లా వైద్యాధికారి జారీచేసిన బోన్ డెన్సిటోమెట్రీ నివేదిక గానీ, వైద్యధ్రువీకరణ పత్రం ఇవ్వాలని వెల్లడించింది. కాగా, పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్కు లక్ష, అలాగే మినీ అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు రూ. 50 వేల చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకాల రూపంలో ఇవ్వాలని నిర్ణయించింది.
- వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం పంచాయతీ పరిధిలోని అన్నారం, చింతలపాడుతో పాటు మరో మూడు గిరిజన గ్రామాల ప్రజల గుండెల్లో మాత్రం వణుకు మొదలవుతుంది. వారికి వర్షం అంటే పరవశం…
- ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు అందించారు. గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తయిన సందర్భంగా ఆర్టీసీ పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై మంత్రి…
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లెస్ కేబినెట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు డిజిటల్ కేబినెట్ సమావేశాల సన్నాహకాల్లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Total views : 150037