Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Main News బాలికల గురుకుల విద్యాలయంలో ఘనంగా యాన్యువల్ డే వేడుకలు..

బాలికల గురుకుల విద్యాలయంలో ఘనంగా యాన్యువల్ డే వేడుకలు..

by Rama
Annual Day Celebrations

బాలికల గురుకుల విద్యాలయం (Girls Gurukula Vidyalaya):

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవి మల్లెల బాలికల గురుకుల విద్యాలయంలో యాన్యువల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ పాల్గొన్నారు. యాన్యువల్ డే సందర్భంగా విద్యార్థులు అంతా పండగ వాతావరణం లో సందడి చేస్తూ విశిష్ట అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానందుకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఎమ్మెల్యే పాఠశాలలో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులపై చదువుల ఒత్తిడి ఉండదని.. అనేక రకాల సాంస్కృతిక, వైజ్ఞానిక వంటి కార్యక్రమాలతో విద్యార్థులపై పడుతున్న ఒత్తిడిని తగ్గించి మానసికంగా ఉత్తేజపరిచి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నామన్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

ఎమ్మెల్యే రాగమయి దయానంద మాట్లాడుతూ.. తాను చదువుకునే రోజుల్లో యాన్యువల్ డే అంటే మీలాగే ఎంజాయ్ చేసే దానిని అంటూ తన స్కూల్ రోజులను గుర్తు చేసుకున్నారు. స్కూల్ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని ఇక్కడ విద్యార్థులు కూడా అంతే స్థాయిలో యాక్టివ్ గా ఉన్నారని ప్రశంసించారు. పాఠశాలకు కావలసిన ప్లే గ్రౌండ్, వాటర్ సమస్య ను అప్పటికప్పుడే అధికారులకు ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు. చదువులు పట్ల ఆడవారిపై ఉన్న అపోహలు తొలగిపోయేలా ప్రతి ఒక్కరూ మంచిగా చదవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గురుకుల విద్యాలయాల ఆర్ సి ఓ, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. Read Also..

  • కొండా సురేఖకు బుజ్జగింపులు.
    తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, మాజీ మంత్రి కొండా సురేఖకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇటీవల పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.…
  • ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.
    తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫసల్ బీమా యోజన అమలుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినూత్న నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో కూడా అమలు చేయాలంటూ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.…
  • తెలంగాణలో ఆర్టిఫిషియల్‌ పనీర్‌పై నిషేధం.
    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అనలాగ్‌, నాన్‌ డెయిరీ, ఆర్టిఫిషియల్‌ పనీర్‌పై ఏడాది పాటు నిషేధం విధించింది. ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీ సేఫ్‌ వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: