Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Main News బాలికల గురుకుల విద్యాలయంలో ఘనంగా యాన్యువల్ డే వేడుకలు..

బాలికల గురుకుల విద్యాలయంలో ఘనంగా యాన్యువల్ డే వేడుకలు..

by Rama
Annual Day Celebrations

బాలికల గురుకుల విద్యాలయం (Girls Gurukula Vidyalaya):

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవి మల్లెల బాలికల గురుకుల విద్యాలయంలో యాన్యువల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ పాల్గొన్నారు. యాన్యువల్ డే సందర్భంగా విద్యార్థులు అంతా పండగ వాతావరణం లో సందడి చేస్తూ విశిష్ట అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానందుకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఎమ్మెల్యే పాఠశాలలో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులపై చదువుల ఒత్తిడి ఉండదని.. అనేక రకాల సాంస్కృతిక, వైజ్ఞానిక వంటి కార్యక్రమాలతో విద్యార్థులపై పడుతున్న ఒత్తిడిని తగ్గించి మానసికంగా ఉత్తేజపరిచి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నామన్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

ఎమ్మెల్యే రాగమయి దయానంద మాట్లాడుతూ.. తాను చదువుకునే రోజుల్లో యాన్యువల్ డే అంటే మీలాగే ఎంజాయ్ చేసే దానిని అంటూ తన స్కూల్ రోజులను గుర్తు చేసుకున్నారు. స్కూల్ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని ఇక్కడ విద్యార్థులు కూడా అంతే స్థాయిలో యాక్టివ్ గా ఉన్నారని ప్రశంసించారు. పాఠశాలకు కావలసిన ప్లే గ్రౌండ్, వాటర్ సమస్య ను అప్పటికప్పుడే అధికారులకు ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు. చదువులు పట్ల ఆడవారిపై ఉన్న అపోహలు తొలగిపోయేలా ప్రతి ఒక్కరూ మంచిగా చదవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గురుకుల విద్యాలయాల ఆర్ సి ఓ, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. Read Also..

  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..
    అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటుంటే.. కల్లాల్లో రైతుల కన్నీళ్లు ఉప్పొంగుతున్నాయి. పంటలు పండించిన పాపానికి..అమ్ముకోలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో…
  • ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ??
    ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి నది అంత్య పుష్కరాల‌కు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్కరాలకు హాజరు కావాల్సిందిగా దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో…
  • తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .
    గిరిజనులకు వ్యవసాయం తర్వాత రెండో జీవనాధారమైన తునికాకు సేకరణ ప్రక్రియ మొదలైంది. అడవుల్లో లభించే ఈ ఆకులను సేకరించి గిరిజనులు ఆదాయం పొందుతారు. ముఖ్యంగా ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోని అడవుల్లో తునికాకు విస్తృతంగా లభిస్తుంది. బీడీలు తయారు చేయడానికి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014611
Total views : 80590

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.