Wednesday, June 3, 2026
News Navigation
Wednesday, June 3, 2026
News Navigation

Breaking

Wednesday, June 3, 2026
Home Politics దెబ్బతిన్న పంటలను పరిశీలించిన జూపల్లి..

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన జూపల్లి..

by Rama
Jupalli Krishna Rao

పంట నష్టం జరిగిన రైతులందరికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishnarao) అన్నారు. కామారెడ్డి (Kamareddy) జిల్లాలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి జూపల్లి పరిశీలించారు. బిక్నూర్ మండలం మాసుపల్లి, జంగంపల్లి, దోమకొండా మండలం లింగుపల్లి గ్రామాల్లో పంటల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి పంట నష్టంపై సర్వే చేయాలని అధికారులను ఆదేశించారన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10వేల చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. సర్వే పూర్తికాగానే అధికారుల నివేదిక ప్రకారం రైతులకు ఆర్థికసాయం చేస్తామన్నారు. 4-5 ఎకరాలున్న రైతులకు వారం రోజుల్లో నగదు బదిలీ పూర్తి చేస్తామని మంత్రి జూపల్లి తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట..


హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార …
కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.
నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు. కొండమల్లేపల్లి నుంచి నాంపల్లి వెళ్లే ప్రధాన …
ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..
అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణవాసి అనురూప్‌ రెడ్డి ..ముగ్గురు స్నేహితులను కాపాడి..అనూహ్య రీతిలో …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019595
Total views : 91190

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.