రఘురామకృష్ణరాజు (Raghuramakrishna Raju) :
టీడీపీ నేత రఘురామకృష్ణరాజు (Raghuramakrishna Raju) పోటీపై స్పష్టత వచ్చింది. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్ఠానం తనను ఆదేశించిందని ఆయన ప్రకటించారు. పార్టీ బీఫాం అందుకుంటానని, ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేస్తానని ఆయన వెల్లడించారు. ఉండి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తానని రఘురామకృష్ణరాజు తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
దీంతో ఉండి నియోజకవర్గ టీడీపీ బీఫామ్ను ఆయన అందుకోనున్నారు. కాగా నరసాపురం ఎంపీగా ఉన్న రఘు రామకృష్ణరాజుకు ఉండి అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారంటూ వార్తలు వెలువడ్డాయి. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నట్టు తెలుస్తోంది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీ వర్షాలకు పెరుగుతోన్న గోదావరి ఉధృతిగోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో క్షణక్షణానికీ ప్రవాహం పెరుగుతోంది. ఏపీలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.20 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అన్ని గేట్లు ఎత్తి 13.27…
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సురేష్ గోపితిరుమల శ్రీవారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం అర్చన సేవలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ…
- తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబుప్రజల కోసం తాను జీవితాంతం పని చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు అండగా ఉంటానని హామీ…