అనిరుద్ రెడ్డి సంచలన నిర్ణయం…

The MLA submitted the complaint documents to the police

Advertisements

&NewLine;<p>మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇటీవల ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు&period; ప్రభుత్వం తనకు పోలీస్ ఎస్కార్ట్ కేటాయించడంతో అది తనకు అవసరం లేదంటూ పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించాలని అన్నారు&period; తనను గెలిపించిన ప్రజలే తనకు బాడీ గార్డులు అని నిత్యం ప్రజలలో తిరిగే తనకు పోలీసుల అవసరం లేదని ప్రజల అవసరాల కోసం పోలీసులు నిత్యం పని చేస్తే చాలని నిన్న రాష్ట్ర డి ఐ జి చౌహన్&comma; జిల్లా ఎస్పీ హర్షవర్ధన్&comma; అడిషనల్ ఎస్పీ రాములకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా వినతులను సమర్పించారు&period; ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లలో పోలీస్ సిబ్బంది తక్కువగా ఉండడం మరోవైపు గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే కోసం గంటలు తరబడి పోలీసులు పడిగాపులు కాస్తూ ఉండడంతో సమయం వృధా అయ్యేదని అలా కాకుండా తమ ప్రభుత్వ హయాంలో ఆ సమయాన్ని ప్రజల కోసం వెచ్చిస్తే ప్రజలకు న్యాయం చేసేవారు అవుతారని తాను నిత్యం ప్రజల్లో ఉండేవాడిని కనుక తనకు పోలీసుల సెక్యూరిటీ కూడా అవసరం లేదని ప్రజలకు న్యాయం చేస్తే సరిపోతుందని ఆయన అన్నారు&period; ఇలా ప్రభుత్వం ఏర్పడ్డ కొన్నాళ్లకే ఎమ్మెల్యే ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడం పట్ల జిల్లాలో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..

భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి అమెరికాలో భారీ ఉపశమనం లభించింది..

చీర కట్టు, నుదుటన బొట్టుతో ఓ భారత నటి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొట్టింది.