మార్టేరులో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.

మార్టేరులో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

Advertisements

<p>పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు&period; అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెబుతోందన్నారు&period; డిసెంబర్ 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు&period; గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రైతుల్లో భయాందోళనలు కలిగించిందని&comma; దానిని రద్దు చేసి రైతులకు న్యాయం చేశామని అన్నారు&period; రైతుల ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు&period; మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు చేస్తూ&period;&period; ప్రజా సమస్యలపై పోరాడే ధైర్యం ఆయనకు లేదన్నారు&period; మాజీ ఎమ్మెల్యే రంగనాథ రాజు ఇంటి స్థలాల పేరుతో 50 వేల చొప్పున వసూలు చేసి పట్టాలు ఇచ్చారని ఆరోపించారు&period;<br &sol;>&NewLine;విద్యా రంగంలో కూడా మార్పులు తీసుకొచ్చామని&comma; గత రెండేళ్లతో పోలిస్తే విద్యార్థుల చేరికలు 10 శాతం పెరిగాయని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.