Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home TelanganaMahabubnagar ఉచిత బస్సు రద్దు చేయాలంటూ ఆటో డ్రైవర్ల ఆందోళన..

ఉచిత బస్సు రద్దు చేయాలంటూ ఆటో డ్రైవర్ల ఆందోళన..

by Rama
Auto Drivers Rally

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో ఆటో డ్రైవర్ లు మరియు జీపు డ్రైవర్లు వాళ్ల యొక్క ఆటోలు మరియు జీపులను స్థానిక బస్టాండ్లో నిలిపిఉంచి నిరసన తెలిపారు. అనంతరం డ్రైవర్లు అంతా కలిసి మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాన పథకం రద్దు చేయాలంటూ ర్యాలీ తీశారు.ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంమహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం వల్లమా ఆటో మరియు జీపు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గతంలో ఆటో, జీపుల ద్వారా రోజుకు 500 రూపాయలు సంపాదించే వారిమని, ఇప్పుడు ఈ పథకం వల్ల రోజుకు వంద రూపాయలు కూడా మా ఆటో, జీపులకు గిరాకీలు కావడం లేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించిత ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రద్దు చేసి, మా ఆటో డ్రైవర్ లను ఆదుకోవాలని తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

014207
Total views : 79552

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.