రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేసి, విద్యార్థులకు అన్ని రకాల ఫీజులను రద్దు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులను, కాస్మోటిక్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన….
337
previous post






Total views : 194951