ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు 26.12.23 మంగళవారం ఉదయం 11 గంటలకు బాపట్ల మున్సిపల్ హై స్కూల్ లో బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడుదాo ఆంధ్ర అనే కార్యక్రమం మంచి స్ఫూర్తితో కూడిన క్రీడాకారులకు మంచి నైపుణ్యం అందిస్తుందని కలెక్టర్ అన్నారు. మనం ఈ బిజీ కాలంలో మానసికంగా ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉంటామని, అలాంటి టైంలో ప్రతిరోజు ఏదో ఒక సమయం కేటాయించి క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ శారీరకంగా క్రీడలతో మానసిక ఉల్లాసం పొందచ్చని ఆయన అన్నారు. ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా రాష్ట్రవ్యాప్తంగా గుంటూరులో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని, ప్రతి ఒక్క క్రీడాకారుడు, విద్యార్థులు, విద్యార్థినిలు, యువకులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ముఖ్య మంత్రి ఆలోచన ధోరణికి అద్ధం పడుతుందని, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు, విద్యార్థినిలు, యువకులు లాప్టాప్లు సెల్ ఫోన్లతో బిజీ లైఫ్ లో ఉన్నారని గమనించి శారీరకంగా అందరూ కష్టపడితే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని ఈ అవకాశాన్ని స్కూలు, కాలేజీ విద్యార్థులు, విద్యార్థినిలు, యువకులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.
State Chief Minister YS Jaganmohan Reddy
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గుంతకల్లు శాసనసభ్యులువై వెంకట్రామిరెడ్డిగారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్ అండ్ బి బంగ్లా ఆవరణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ భూమి పట్టాల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. అనంతరం పట్టణంలోని 23వ వార్డుకు చెందిన సచివాలయం వద్ద ఏర్పాటుచేసిన సభలో ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కార్డులు పంపిణీ చేశారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలకు ట్యాబులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని అలాగే గుంతకల్లు నుంచి తనను కూడా రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను కోరారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. రాయదుర్గం పురపాలక సంఘంలో కార్మికులకు దుస్తులు, నిత్యవసరాలను పంపిణీ చేశారు.
అనంతరం పట్టణంలోని వినాయక సర్కిల్లో కేక్ కోసి వైకాపా నాయకులు సంబరాలు జరుపుకున్నారు. రాయదుర్గం కమ్యూనిటీ ప్రభుత్వ వైద్యశాలలో ఎమ్మెల్యే సతీమణి, అనంతపురం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు కాపు భారతి, కుమారుడు కాపు ప్రవీణ్ కుమార్ రెడ్డి, వైకాపా నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో రాయదుర్గం మున్సిపల్ చైర్ పర్సన్ పోరాల్లు శిల్ప, మున్సిపల్ కౌన్సిలర్లు, వైకాపా సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేసి, విద్యార్థులకు అన్ని రకాల ఫీజులను రద్దు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులను, కాస్మోటిక్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.





Total views : 78236