Friday, May 15, 2026
News Navigation
Friday, May 15, 2026
News Navigation

Breaking

Friday, May 15, 2026
Home International ఫ్రాన్స్‌లో క్రూయిజ్ నౌకలో నోరోవైరస్ కలకలం..

ఫ్రాన్స్‌లో క్రూయిజ్ నౌకలో నోరోవైరస్ కలకలం..

by CVR NEWS
ఫ్రాన్స్‌లో క్రూయిజ్ నౌకలో నోరోవైరస్ కలకలం

క్రూయిజ్‌ షిప్స్‌లో వైరస్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల హంటా వైరస్‌ భయాందోళనలకు గురి చేసింది. తాజాగా ‘యాంబిషన్’ అనే క్రూయిజ్ నౌకలో నోరోవైరస్ వ్యాప్తి చెందడంతో ఫ్రాన్స్‌‌లో కలకలం రేగింది. దాదాపు 1700 మంది ప్రయాణికులు, సిబ్బందితో బెల్‌ఫాస్ట్ నుంచి స్పెయిన్‌కు వెళ్తున్న ఈ నౌకను ఫ్రాన్స్‌‌లోని బోర్డెక్స్ పోర్టులో అధికారులు నిలిపివేశారు. నౌకలోని సుమారు 50 మంది ప్రయాణికులు వాంతులు, విరేచనాల వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన ఫ్రెంచ్ అధికారులు నౌకను తాత్కాలికంగా క్వారంటైన్ చేశారు. మే 10న నౌకలో 92 ఏళ్ల వృద్ధుడు మరణించినట్లు ప్రకటించింది ‘అంబాసిడర్ క్రూయిజ్ లైన్’. అయితే, అతడి మరణానికి, ఈ వైరస్ వ్యాప్తికి ఎలాంటి సంబంధం లేదని, మృతుడికి వైరస్ లక్షణాలు లేవని స్పష్టం చేసింది. వైద్య బృందాలు నౌకలోని వారి నుంచి నమూనాలు పరీక్షించి అది నోరోవైరస్ వ్యాప్తిగా నిర్ధారించారు. అనంతరం, ఎలాంటి లక్షణాలు లేని ప్రయాణికులు నౌక నుంచి దిగేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. వైరస్ సోకిన వారికి నౌకలోనే ఐసొలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు. ఇటీవల మరో నౌకలో వ్యాపించిన హంటా వైరస్‌కు, ప్రస్తుత నోరోవైరస్ ఘటనకు ఎటువంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. నౌకలో మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టినట్లు, ప్రయాణికులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు క్రూయిజ్ సంస్థ తెలిపింది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

012840
Total views : 76670

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.