567
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఎయిమ్స్లోని వివిధ వార్డులు, అత్యవసర విభాగాలను పరిశీలించిన జేపీ నడ్డా… రోగులకు అందుతున్న వైద్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి… 2014 తర్వాత దేశంలో రికార్డు స్థాయిలో 23 ఎయిమ్స్ ఆసుపత్రులు వచ్చాయని గుర్తుచేశారు. వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, త్వరలోనే ఇది ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.