Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home Andhra Pradesh నేడు ఉదయం 10.30 కి ఏపీ కేబినెట్ భేటీ.

నేడు ఉదయం 10.30 కి ఏపీ కేబినెట్ భేటీ.

by CVR NEWS

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఉదయం 10.30 కి వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అమరావతి రాజధాని ప్రాంత ల్యాండ్ పూలింగ్ రైతులకు సంబంధించి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజధాని విస్తరణ కోసం కొత్తగా భూములిచ్చే రైతులకు ఎకరానికి ఏడాదికి 40 వేల చొప్పున యాన్యుటీ చెల్లించే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ నిర్ణయం రాజధాని నిర్మాణానికి భూములిచ్చే రైతులకు ఆర్థికంగా ఎంతో ఊరటనివ్వనుంది. దీంతో పాటు, రాజధాని పరిధిలోని గ్రామ కంఠాల్లో అక్రమణల తొలగింపు, మాస్టర్ ప్లాన్ రోడ్ల విస్తరణ కారణంగా ఇళ్లు, భూములు కోల్పోయిన బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇళ్లు కోల్పోయిన సదరు లబ్ధిదారులకు నెలకు 10 వేల చొప్పున అద్దె భత్యం ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. ల్యాండ్ పూలింగ్ రైతులకు ప్రయోజనం చేకూర్చే ఈ నిర్ణయాలతో పాటు, రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాలు, ఐటీ పాలసీ, పలు సంక్షేమ పథకాలపై కూడా ఈ కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించి తుది నిర్ణయాలు తీసుకోనున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: