43
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రైతాంగానికి అవసరమైన సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెంలో డిప్యూటీ సీఎం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగన్నాధపురం మత్కేపల్లి క్రాస్ రోడ్డులో రైతు ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్రెడ్డితో పాటు కేబినెట్ మంత్రులు అందరినీ ఆహ్వానించామని పేర్కొన్నారు.






Total views : 197912