ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు భారీ ఆర్థిక మద్దతు లభించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి అదనంగా రూ.15 వేల కోట్ల రుణం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయం అమరావతి అభివృద్ధి పనులకు మరింత వేగం తీసుకురానుంది. ఇప్పటికే ఈ రెండు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అమరావతి అభివృద్ధి కోసం 1.6 బిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేస్తున్నాయి. ఈ నిధులు రోడ్లు, మౌలిక సదుపాయాలు, డ్రైనేజ్ వ్యవస్థలు, నీటి సరఫరా మరియు ఇతర పట్టణ అభివృద్ధి పనులకు వినియోగించనున్నారు. ఇప్పుడు అదనంగా మరిన్ని నిధులు సమీకరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రపంచ బ్యాంక్ మరియు ADB నుండి మరో విడతగా రుణం పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దరఖాస్తు చేయనుందని సమాచారం. ఈ అదనపు నిధులు రాజధాని నిర్మాణంలో కీలక మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. దీంతో అమరావతి నిర్మాణ పనులు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా, హడ్కో కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం అందిస్తున్నట్లు సమాచారం. ఈ నిధులు రాష్ట్రంలోని పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగపడతాయి.
రాజధాని అమరావతి నిర్మాణ పనులు మరింత వేగవంతం..
213
previous post




Total views : 199350