అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గుంతకల్లు శాసనసభ్యులువై వెంకట్రామిరెడ్డిగారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్ అండ్ బి బంగ్లా ఆవరణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ భూమి పట్టాల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. అనంతరం పట్టణంలోని 23వ వార్డుకు చెందిన సచివాలయం వద్ద ఏర్పాటుచేసిన సభలో ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కార్డులు పంపిణీ చేశారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలకు ట్యాబులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని అలాగే గుంతకల్లు నుంచి తనను కూడా రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను కోరారు.
గుత్తిలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు…
322
previous post





Total views : 78300