41
దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు పెరగకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చక్కెర ఎగుమతుల నిషేధాన్ని 2026 సెప్టెంబర్ వరకు పొడిగించింది. దేశంలో నిల్వలు పెంచడం, సామాన్యులపై ధరల భారం పడకుండా చూడడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చెరకు దిగుబడి తగ్గడం, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉత్పత్తిపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలకు దిగింది. భారత్ నుంచి ఎగుమతులు నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో చక్కెర ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.





Total views : 76670