Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home International కాలమ్‌లో బైడెన్‌ కీలక వ్యాఖ్యలు

కాలమ్‌లో బైడెన్‌ కీలక వ్యాఖ్యలు

by Satya
Biden

యుద్ధం ముగిసిన తర్వాత గాజా ప్రాంతం అధికార పగ్గాలను వెస్ట్‌బ్యాంక్‌ను పాలించే పాలస్తీనా అథారిటీయే చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. అంతిమంగా రెండు దేశాల ఏర్పాటుతో ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణకు తెరపడాలని ఆయన ఆకాంక్షించారు. గాజా నుంచి పాలస్తీనావాసులను బలవంతంగా పంపించకూడదని ఇజ్రాయెల్‌కు బైడెన్ సూచించారు. గాజాలో మళ్లీ ఇజ్రాయెల్ ఆర్మీ ఆక్రమణలు చేయకూడదని తేల్చి చెప్పారు. ‘ది వాషింగ్టన్‌ పోస్టు’కు రాసిన ప్రత్యేక కాలమ్‌లో బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనా పౌరులపై దాడులు చేస్తున్న ఇజ్రాయెలీ అతివాదులకు అమెరికా వీసాలను ఇవ్వబోమని బైడెన్‌ వార్నింగ్ ఇచ్చారు. సాధారణ పౌరులను ఇబ్బందిపెడుతున్న ఇలాంటి వారిని గుర్తించి, తగిన మూల్యం చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఇజ్రాయెల్‌ను బైడెన్‌ కోరారు. దీనిపై ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వాదన ఇంకోలా ఉంది. ‘‘పాలస్తీనా అథారిటీకి గాజాను పాలించే సామర్థ్యం లేదు అనీ యావత్ గాజా సైనిక రక్షణ బాధ్యతలను ఇజ్రాయెల్‌ చూస్తుందన్నారు. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌ ఏరియాలో సైన్యం దాడులు, ఇజ్రాయెలీ సెటిలర్ల హింస కారణంగా గత రెండు వారాల్లో 200 మంది పాలస్తీనియన్లు చనిపోయిన నేపథ్యంలో బైడెన్ పై ప్రకటనను విడుదల చేశారు.

Advertisements

You may also like

Our Visitor

039122
Total views : 194347

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: