రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోడ్ల దుస్థితిపై తెలుగుదేశం-జనసేన ఆధ్వర్యంలో మార్కాపురం నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్లి జాతీయ రహదారి ఉన్న గుంతలను చూపిస్తూ గుంతల ఆంధ్రప్రదేశ్కు దారేది సీఎం పేరుతో నిరసనలు చేపట్టారు. అధ్వానంగా తయారైన రహదారులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి పట్టదా అంట్టు ఆందోళనకు దిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రహదారులు నిర్మించాలని టీడీపీ-జనసేన నాయకులు డిమాండ్ చేశారు.