Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home Andhra Pradesh బీజేపీ పై మండిపడ్డ అజయ్ కుమార్..

బీజేపీ పై మండిపడ్డ అజయ్ కుమార్..

by Prakash
ajay kumar

తిరుపతి అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని ఎక్కడి నుంచో వచ్చి తిరుపతిలో బిజెపి పార్టీ ద్వారా పరిచయమై అంచలంచలుగా ఎదిగిన తిరుపతి ప్రజలు బిజెపిలో భాను ప్రకాష్ రెడ్డికి ఓ స్థానం కల్పించారు. అలాంటి తిరుపతి ప్రజలకు అన్యాయం చేసే విధంగా భాను ప్రకాష్ రెడ్డి వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ నాయకులు అజయ్ కుమార్. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఆయా ప్రాంతాలలో ఉన్న వాటిని అభివృద్ధి చేయాలని జీవోనే చెబుతుండగా దీనిని అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. పేదల పక్షాన నిలబడే శ్రీహరే అభివృద్ధి చేస్తానంటుంటే దీనిని ఓర్వలేక అడ్డుకోవడం మంచిది కాదని, ఒక్క శాతం నిధులు తో తిరుపతి అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేకనే బిజెపి నాయకులు ఈరోజు ఈ విధంగా వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. తిరుపతిలో అనేక డివిజన్లు కనీసం కాలువలు లేకుండా ఇబ్బంది పడుతున్నారని, స్మార్ట్ సిటీగా ఏర్పడినా.. స్మార్ట్ సిటీ నిధులతో ఆడిటోరియాలు మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారే తప్ప స్లమ్మ్ ఏరియాలలో ఉన్న వాటిని డెవలప్ చేయడం కుదరదని, అందుకు టిటిడి నిధులను వాడుకుంటే తప్పేమని ప్రశ్నించారు. తిరుపతిలో ఉన్న డివిజన్లో ఎక్కువ శాతం వెనుకబడిన అన్నగారికి వర్గాలు చెందినవారు ఉన్నారని, అటువంటి ప్రాంతాలను భూమన కరుణాకర్ రెడ్డి ఎంతో ముందు చూపుతో ఆ ప్రాంతాలను సైతం అభివృద్ధి చేయాలని పాటుపడుతుంటే దీనికి అడ్డు పుల్ల వేయడం బిజెపికి తగదని తనదైన శైలిలో బిజెపి నాయకులపై విరుచుకుపడ్డారు అజయ్ కుమార్.

Advertisements

You may also like

Our Visitor

009333
Total views : 61581

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.