అధికారం కోల్పోయి డీలా పడిన బీఆర్ ఎస్ పార్టీ క్యాడర్ను.. టార్గెట్ చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగించే పనిలో బీజేపీ నేతలు పడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున ఆ పార్టీ నేతలు ఎలాగూ బీజేపీ వైపు వచ్చే పరిస్థితి లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితేనే సులభంగా పార్టీలో చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ పార్టీని దెబ్బతీసే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల శాతం పెంచుకుని 8 ఎంపీ సీట్లను గెల్చుకున్నప్పటికీ పార్టీలో ఎవరూ చేరడం లేదు. పార్టీలో చేరికలకు సంబంధించి కమిటీ ఛైర్మన్ గా ఈటల రాజేందర్ ను నియమించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ఈటల అయితేనే ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులను ఆకర్షిస్తాడని భావించిన బీజేపీ హైకమాండ్.. ఈటలను చేరికల కమిటీకి ఛైర్మన్ గా నియమించింది. పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులు బీజేపీ చేరారు. అయితే ఆ తర్వాత ఎవరూ కూడా కమలం వైపు ఆసక్తి చూపడం లేదు. అయితే బీజేపీ నాయకులు మాత్రం తమ పార్టీలో చేరేందుకు చాలా మంది క్యూ కడుతున్నారని చెబుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందనదేశానికి అన్నం పెట్టే అన్నదాత.. ఇప్పుడు అడుగడుగునా దగా పడుతున్నాడు. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ప్రార్థించిన ఆ కళ్లు.. ఇప్పుడు గిరిజన సహకార సంఘం కొనుగోలు కేంద్రాల వైపు దీనంగా చూస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో అన్నదాతల పరిస్థితి…
- వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.రాష్ట్రంలో వానాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. రైతన్నలకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా అధికారులకు, విత్తన కంపెనీల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. నకిలీ విత్తనాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని,…
- ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ? ఎల్ అండ్ టీ లాంటి పెద్ద సంస్థ ఎందుకు మెట్రో రైల్ ను నడపలేకపోయింది ? ప్రభుత్వ పరం అయిన…
- చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.చైల్డ్ ట్రాఫికింగ్ కేసును గుజరాత్ పోలీసులు అత్యంత సీరియస్గా తీసుకుని దేశవ్యాప్తంగా ఆపరేషన్ చేపట్టారు.‘ఆపరేషన్ దేవ్’ పేరిట గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు.ఈ కేసులో భాగంగా తెలంగాణలో మురుగన్ అలియాస్ నాగరాజు గ్యాంగ్ను గుజరాత్ పోలీసులు…
- ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2,540 కోట్ల రూపాయలతో అమరావతిలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 61469