Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Latest News తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది – అమిత్ షా

తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది – అమిత్ షా

by Prakash
central minister

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉన్న ప్రాంతానికి వచ్చినందుకు నేను ఎంతో అదృష్టవంతున్ని. భువనగిరి ఖిల్లను చూస్తే చాలా భాద అనిపించింది. కోటను 25కోట్లతో అభివృద్ధి చేస్తాం. తెలంగాణ లో బిజెపి అధికారంలోకి వస్తే మూసి ప్రక్షాళన చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ప్రజలే బాగుచేయలి. నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు ఇస్తానని కేసీఆర్ మాట తప్పారు. భూదాన్ పోచంపల్లిలో వినోదాభావే భూదాన్ ఉద్యమం చేస్తే ఇప్పుడు కేసీఆర్ భూ కబ్జా ఉద్యమం చేస్తున్నారు. కెసిఆర్ రాష్ట్రంలో వేలకోట్ల రూపాయల భూములను కబ్జా చేశాడు. బిజెపి అధికారంలోకి రాగానే కెసిఆర్ అవినీతిపై విచారణ జరిపి జైల్లో పెడతాం. తెలంగాణలో బిఆర్ఎస్ కు విఆర్ఎస్ కాలేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా విషయంలో కెసిఆర్ ఎన్నడు మోడీని కలవలేదు. కేసీఆర్ అబద్దాలను చెబుతున్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే కెసిఆర్ కు వేసినట్టే. 2014 ,2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ లో చేరారు. ఎస్సీ వర్గీకరణకు బిజెపి ప్రభుత్వం కట్టుబడి ఉంది. బిఆర్ఎస్ సర్కార్ మిషన్ భగీరథ, మద్యం కుంభకోణాల్లో, ఓ ఆర్ ఆర్ కుంభకోణం, మిషన్ కాకతీయ, కాలేశ్వరం లాంటి కుంభకోణాలు చేశాయి. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా చేస్తాం. బిజెపి ఎమ్మెల్యేలను గెలిపిస్తే తెలంగాణను నెంబర్ వన్ గా చేస్తాం.

Advertisements

You may also like

Our Visitor

009383
Total views : 62173

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.