ప.గో.జిల్లా వెంప ఆంజనేయస్వామి ఆలయంలో విశేష ఘటన.

ప.గో.జిల్లా వెంప ఆంజనేయస్వామి ఆలయంలో విశేష ఘటన

Advertisements

<p>పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ ఆంజనేయస్వామి ఆలయంలో విశేష ఘటన చోటుచేసుకుంది&period;భీమవరం మండలం వెంప గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక హోమాలు నిర్వహించారు&period; ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు&period;హోమాలు కొనసాగుతున్న సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన ఓ వానరం నేరుగా ఆలయంలోకి ప్రవేశించింది&period; భక్తులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఎలాంటి ఆందోళనకు గురికాకుండా గర్భగుడి ముందు ప్రశాంతంగా కూర్చుని హోమాలు పూర్తయ్యే వరకు పూజా కార్యక్రమాలను తిలకించింది&period;ఈ దృశ్యాలను చూసిన భక్తులు భావోద్వేగానికి గురయ్యారు&period; ఆంజనేయస్వామి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక హోమాలకు స్వయంగా ఆంజనేయస్వామి విచ్చేశారంటూ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.